మహేష్ ” గుంటూరు కారం ” సినిమాపై క్రేజీ రూమర్..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ” గుంటూరు కారం ” సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని.. ఈ పాత్ర క్లైమాక్స్‌లో ఉంటుందని.. పైగా సెకండ్ హాఫ్ మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందని సమాచారం. ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కనిపించనున్నాడని టాక్.

 

అందుకే ఈ అనుబంధం కారణంగానే జవాన్ సినిమాకి సపోర్ట్ గా మహేష్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడని అంటున్నారు. ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరిని.. పూజా హెగ్డే స్థానంలో తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుందట. కాగా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది.

ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీ తో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. పైగా ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలియాల్ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. హారిక, హాసిని క్రియేషన్స్ వారు భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మహేష్ కెరీర్‌లో 28వ సినిమాగా తెరకెక్కనుంది. 2024 జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రానుంది.