చిరంజీవి – త్రివిక్ర‌మ్ క్రేజి కాంబినేష‌న్‌.. బ్లాక్ బస్టర్ ప‌క్కా అంటున్న ఫ్యాన్స్‌….!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తన 157వ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుండగా దీనిని గ్రాండ్ లెవెల్ లో యువి క్రియేషన్స్ బ్యానర్ పై నాగా వంశీ, ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాపై చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ మెగా మూవీకి చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందించగా ఎస్ ఎస్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ఇక మరోవైపు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తీస్తున్న త్రివిక్రమ్.. దాని అనంతరం అల్లు అర్జున్ తో ఒక మూవీ కమిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం గుంటూరు కారం అనంతరం మెగాస్టార్‌తో త్రివిక్రమ్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ చేస్తున్న అల్లు అర్జున్ దాని తరువాత అట్లీతో ఒక భారీ మాస్ యాక్షన్ మూవీ చేయనున్నారని.. వాటి అనంతరమే త్రివిక్రమ్ మూవీ ఉంటుందని సమాచారం.

అందుకే ఈలోపు మెగాస్టార్ కోసం ఒక మంచి కమర్షియల్ సబ్జెక్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. నిజానికి మెగాస్టార్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ ఉంటుందని కొన్నేళ్ల క్రితం నుంచి న్యూస్ వస్తూంది. అలానే వారిద్దరూ డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా చేస్తారని టాక్. మొత్తంగా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే మెగా ఫాన్స్ కి ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి.