షాలినీ కంటే ముందే ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేసిన అజిత్.. పెళ్లి చేసుకుంటానని ఆమె ఇంటికి కూడా వెళ్లాడట..?!

తమిళ్ ఇండస్ట్రీలో జెంటిల్మెన్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో అజిత్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన కెరీర్‌తో పాటు కుటుంబ జీవితంలో కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు కొనసాగుతున్నాడు అజిత్‌. ఇతని లాంటి భర్తే కావాలని కోలీవుడ్లో చాలామంది యూత్ కలలు కంటూ ఉంటారు. ఇక పెళై 23 ఏళ్లు గడిచిన అజిత్‌కి భార్య షాలినిపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఆదర్శ జంట జాబితాలో వీరి పేర్లు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇక అజిత్ వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు. అజిత్ స్టార్‌డ‌మ్‌ వచ్చిన సరే ఎటువంటి గర్వం లేకుండా ఉంటారు.

ఒక సినిమా పూర్తి చేసిన తర్వాత దానికి సంబంధించిన అన్ని విషయాలను మర్చిపోయి బైక్ రైడ్ చేస్తూ తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ప్రమోషన్స్ కోసం ఎప్పుడు వేదికపై కనిపించని అజిత్.. అభిరుచి కొనసాగించడానికి భార్య షాలిని మద్దతు ఎక్కువగా ఉంటుంది. ఇక అజిత్ షాలిని ని సినిమాల ద్వారా సంపాదించిన నిధిగా భావిస్తాడు. 2000లో అజిత్ – షాలిని ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. అమరకలం సినిమా షూటింగ్ టైంలో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడం ఇరు కుటుంబాలు వారి ప్రేమను యాక్సెప్ట్ చేయడంతో వీరిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు.

అయితే వీరిద్దరికి వివాహం కాకముందు అజిత్ మరో హీరోయిన్ తో రొమాన్స్ చేశాడని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళ్ బ్యూటీ హీరా రాజగోపాల్‌తో అజిత్ ప్రేమలో ఉన్నాడని అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అజిత్ సినీ కెరీర్ స్టార్టింగ్‌లో ఆమె చాలా సినిమాల్లో అజిత్‌కు అవకాశం వచ్చేటట్లు చేసిందని.. వీరిద్దరి మధ్య ఏవో గొడవల కారణంగా బ్రేకప్ అయ్యిందంటూ న్యూస్ వైరల్ అయింది. అదే సమయంలో అజిత్ -షాలిని కలవడం వీరిద్దరి మధ్యన ప్రేమ చిగురించి వివాహం చేసుకోవడం జరిగిందట.

ఇదే విషయాన్ని విమర్శకుడు కోలీవుడ్ నటుడు అయినా బైల్వాన్ రంగనాథ్ చెప్పుకొచ్చాడు. అలానే 1996లో వచ్చిన తమిళ్ మూవీ భానుమతి సినిమాలో హీరోయిన్గా స్వాతి నటించిందని ఆ సమయంలో అజిత్ స్వాతిని ప్రేమించాడ‌ని. ఒక టైం లో స్వాతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న అజిత్ ఆమె కుటుంబాన్ని కూడా సంప్రదించాడని కానీ ఆమె కుటుంబ అంగీకరించ పోవడంతో దానిని విరమించుకున్నాడని చెప్పుకొచ్చాడు. కానీ అజిత్ ప్రేమించింది మాత్రం హీరా రాజగోపాల్‌నే అంటూ వివరించాడు.