రతికను మర్చిపోలేతున్న రైతు బిడ్డ.. ఆ బ్యూటీ పోస్ట్ వైరల్..

బిగ్‌బాస్ సీజన్ 7 లో అందరికంటే ఎక్కువగా నెగిటివ్ ఇమేజ్ ద‌క్కించుకుంది రతికజ. కేవలం గేమ్ లోనే కాక పర్సనల్ లైఫ్ లోను ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేసే విధంగా ఆమె నెగెటివిటీ తెచ్చుకుంది. ఎప్పుడెప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్‌ అవుతుందా అని ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. నాగార్జున కూడా ఓ ఎపిసోడ్‌లో నువ్వు టాస్క్ లో ఆడడం కంటే మనుషులతో ఎక్కువగా ఆడుకుంటున్నావు అంటూ ఆమెపై ఫెయిర్ అయ్యాడు. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. మొదటివారం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో ఆడుకున్న ర‌తిక‌.. రెండో వారం ప్రిన్స్ యావర్‌తో పులిహార కలిపింది.

మూడో వారం శివాజీని, ఇక నాలుగో వారం అమ‌ర్దీప్‌తో కలిసి పల్లవి ప్రశాంత్ ను మానసికంగా టార్చర్ చేసింది. ప్రతి చిన్నదాన్ని సాగదీస్తూ ఇంటి సభ్యులకు తలనొప్పి పెట్టించింది. దీంతో ఆమెను ఎలిమినేట్ చేశారు ఆడియన్స్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ర‌తిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం లేదు. ఇక తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో పల్లవి ప్రశాంత్ – శివాజీ గురించి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆమె స్టోరీలో ప్రశాంత్.. శివాజీ తో అన్నా నీకు ర‌తిక గుర్తుకు వస్తుందా.. నాకు రాత్రి గుర్తుకు వచ్చిందన్న.. నిద్ర పట్టలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దానికి శివాజీ నాకు గుర్తుకు వచ్చింది. కానీ ఏం చేస్తాం రా.. చిన్న పిల్ల అంటూ చెప్పుకొచ్చాడు.

అది చిన్న పిల్ల ఏంటి అన్న.. బర్రె పిల్ల.. మస్తు కోపం వస్తుందన్న అంటూ ప్రశాంత్ మాట్లాడాడు. బయటికి వెళ్లాక కలుద్దాం లేరా నువ్వు బాధపడకు నాకు అర్థమైంది నీ బాధ అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ రెండు మేకపోతులు తినిపించి చంపేస్తా అన్నదాన్ని.. నామీద ఎందుకన్నా అంత కోపం.. నేనేం చేసినా అన్న.. నామినేషన్ చేసినా కూడా మన అమ్మాయి కదా అని మాట్లాడిన.. నన్ను నమ్మలేదు అన్న తను అంటూ మాట్లాడాడు. చిన్న పిల్ల రా వదిలే అంటే శివాజీ చెప్పుకొచ్చాడు.

నన్ను కలవదు అన్నా బయటకు పోయాక అంటూ.. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న కాన్వర్జేషన్లు రతిక పోస్ట్ చేస్తూ సో స్వీట్ నేను కూడా వాళ్ళని మిస్ అవుతున్నాను అంటూ రాసుకోచ్చింది. ప్రస్తుతం రతిక చేసిన ఈ పోస్ట్ స్క్రీన్ షాట్ తీసి మరి నెట్టెంటి వైరల్ చేస్తున్నారు నిటిజన్లు. హౌస్ లో ఉన్నప్పుడు వాళ్లతో గొడవలు పెట్టుకుని బయటకు వచ్చే ముందు కనీసం వాళ్ళను చూడకుండా వచ్చేసి ఇప్పుడు మిస్ అవుతున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు.