మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టులో ప్రభాస్ తో పాటు ఆ స్టార్ బ్యూటీ..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకసారి ఓ కాంబోలో వచ్చిన సినిమా హిట్ అయి మళ్ళీ అదే కాంబో రిపీట్ కావాలంటే చాలా టైం తీసుకుంటుంది. అదేవిధంగా 16ఏళ్ల తర్వాత మళ్లీ ఒక క్రేజీ కాంబో రిపీట్ కాబోతుంది. ఆ కాంబో మరేదో కాదు ప్రభాస్ – నయనతార, యోగి సినిమా ద్వారా కలిసి నటించిన ఈ జంట.. మ‌రో కొత్త సినిమాలో కలిసి నటించబోతున్నారంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే యోగి సినిమా వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరి కాంబో ఇప్పటికే చాలాసార్లు రిజెక్ట్ అయింది. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప లొ న‌య‌న్ న‌టిస్తుంద‌ట‌. ఈ సినిమా అధికారికంగా పూజ కార్యక్రమాల్లో పూర్తి చేసుకుంది.

స్టార్ ప్లస్ లో మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు ఈ విషయంపై పరోక్షంగా మంచు విష్ణు కూడా స్పందించాడు. ఇక తాజాగా ఇదే ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార కూడా నటించబోతుందంటూ న్యూస్ వినపడుతుంది. ఈమె కూడా కన్నప్ప సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతుందట. మొదటగా కన్నప్ప సినిమాలో హీరోయిన్ గా నుపుర్ సనన్‌ని ఎంపిక చేశారు. అయితే ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.

దీంతో ఈ అవకాశం నయనతారకు వచ్చింది. కన్నప్ప షూటింగ్ మొత్తం న్యూజ్‌ల్యాండ్‌లో జరగబోతుంది. ఒకే ఒక్క షెడ్యూల్ లోనే ఈ షూటింగ్ అంతా పూర్తి చేయబోతున్నట్లు మంచు విష్ణు ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ కావలసిన నెట్వర్క్ అంతా ఫినిష్ అయిందని ఈ మొత్తం సామాగ్రిని 8 కంటెండర్లలో న్యూజిలాండ్ కు తరలించామని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఈ హార్డ్ వర్క్ సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు మూవీ టీమ్‌. అత్యంత భారీ బడ్జెట్లో పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాకు మోహన్ బాబు ప్రొడ్యూసర్గా వ్యవహరించన్నునాడు.