సక్సెస్ అయిన పంచ్ ప్రసాద్ సర్జరీ.. ఏపీ సీఎంకు రుణపడి ఉంటా.. ప్రసాద్ ఎమోషనల్ వీడియో.. !!

జబర్దస్త్ ద్వారా ఎంతోమంది గుర్తింపు సంపాదించుకొని వరుస పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించినటువంటి వారిలో కమెడియన్ పంచ్ ప్రసాద్ ఒకడు. జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే ఇతర బుల్లితెర కార్యక్రమాలలోనూ కమీడియన్ గా కొనసాగుతున్న ప్రసాద్ గత కొద్ది కాలంగా రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అయితే సర్జరీ చేపించుకోవడానికి డబ్బులు లేక డయాలసిస్ తో ఇన్ని రోజులు కాలం వెళ్ళదీశాడు. ఇక ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో సర్జరీ తప్పనిసరి అని వైద్యకులు సూచించారు.

ఈ విధంగా తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాలని చెప్పడంతో అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో నూకరాజు.. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ తనకు సహాయం చేయాలి అంటూ కోరాడు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా ఈయన సర్జరీ కోసం ఏకంగా లక్ష రూపాయలు సహాయం చేశాడు. అలాగే తోటి ఆర్టిస్టులు కూడా ముందుకు వచ్చారు. జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జ్ గా కొనసాగిస్తున్నటువంటి రోజా.. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకి తీసుకువెళ్లింది.

ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డికి తెలియజేయడంతో ఏపీ సర్కార్ ప్రసాద్ సర్జరీకి సరిపడా నిధులను మంజూరు చేసింది. ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈయనకు డబ్బులు రావడంతో యశోద హాస్పటల్లో ఈయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ పూర్తి అయిందని ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని.. త్వరలోనే తాను మీ ముందుకు రాబోతున్నాను అంటూ ప్రసాద్, భార్య సునీత తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసాద ఆరోగ్యం గురించి తెలిపారు. అలాగే ప్రసాద్ సర్జరీ కోసం సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తాము రుణపడి ఉంటామంటూ ఆ వీడియోలో తెలియజేశారు.