కంటిస్టెంట్లను టార్చర్ పెట్టిన రతిక…. బూతులు తిట్టిన అమర్ దీప్….!!

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ సెప్టెంబర్ 14వ ఎపిసోడ్లో మాయాస్త్ర కోసం ఆరుగురు కంటిస్టెంట్లు పోటీపడ్డారు. మాయాస్త్ర టాస్క్ లో భాగంగా రణధీర, మహాబలి అని రెండు టీములుగా విడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. దీంట్లో రణధీర టీమ్ శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభ శెట్టి, షకీలా విజయం సాధించి వారంతా కంటెస్టెంట్లుగా సెలెక్ట్ అయ్యారు. వారికా చెరొకటి మాయస్త్ర భాగం వచ్చింది. రణధీర టీం లోని ఒకరి దగ్గర ఉన్న మాయస్త్ర భాగాన్ని మరొకరికి ఇచ్చి.. ఆఖరుగా ఇద్దరినీ సెలెక్ట్ చేయాల్సిందిగా మహాబలి టీంకు బిగ్‌బాస్ చెప్పాడు.

మహాబలి టీంలో గౌతమ్, శుభశ్రీ, దామిని, పల్లవి ప్రశాంత్, తేజ ఉన్నారు. అయితే వారిలో అర్హులు ఎవరో తగిన కారణాలు చెప్పి ఫైనల్ కంటెస్టెంట్లను సెలెక్ట్ చేయాలి. దీనికి శుభశ్రీ, శోభా శెట్టి దగ్గర నుంచి తీసుకుని ప్రిన్స్ కు ఇస్తుంది. తరువాత ప్రశాంత్ ,అమర్ దీప్ దగ్గర నుంచి తీసుకుని శివాజీకి ఇస్తాడు. ఆ తరువాత మూడో కంటెస్టెంట్ వెళ్లడానికి గొడవ పడతారు. రతిక నీ వెళ్ళమంటే నేను లాస్ట్ వెళ్తాను అని చెబుతుంది. ఎంతసేపటికి ఎవరు వెళ్లకపోవడంతో సందీప్ సీరియస్ అవుతాడు. చివరికి ఎవరు వెళ్లకపోవడంతో బిగ్‌బాస్ ఎవరి చేతిలో అయితే మాయస్త్రాలు ఉంటాయో వారు మాత్రమే ఆటలో ఉన్నట్లు అని చెబుతాడు. అంటే శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక గేమ్ నుంచి తప్పుకున్నట్లు.

దీంతో అమర్ దీప్ కోపంతో శివతాండవం చేశాడు. రెండు రోజులు అంత కష్టపడి ఆడి అంత చిన్న కారణంతో ఆట నుంచి తప్పుకోవాల్సి వస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అసలు పల్లవి ప్రశాంత్ చెప్పింది పాయింట్ కాదని.. అసలు తనకు గేమ్ తెలియదని. ఎందుకు వస్తారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాయాస్త్ర భాగం ప్రశాంత్ వల్ల కోల్పోవడం.. ర‌తీక సమయం వేస్ట్ చేయడం వల్ల బిగ్ బాస్ ప్రకటన రావడంతో ఇద్దరినీ కలిపి బూతులు తిడతాడు అమర్ దీప్. అతని మాటలకు బ్రేక్ వేశారు. మనం ఒక షోలో ఉన్నామని గుర్తుపెట్టుకుని మాట్లాడు అమర్ అని శోభా శెట్టి అంటుంది. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్లని ర‌తీక బాగానే టార్చర్ చేసింది.