ర‌తిక మా వాడిని వాడుకుంది.. తప్పకుండా పెళ్లి చేసేస్తా.. పల్లవి ప్రశాంత్ తల్లి కామెంట్స్…!!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 7 షో కి వెళ్లి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. తన మాట తీరు.. ఆటతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. తాజాగా ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలు పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడి తల్లి మాట్లాడుతూ ” నా కొడుకు బిగ్ బాస్ షోకి వెళ్ళినందుకు సంతోషంగా ఉంది. కానీ అమర్ దీప్ నా కొడుకును ఏందిరా అన్నందుకు బాధేసింది.

నా కొడుకును రైతు అని హేళన చేస్తున్నారు. నాకు అదుంది, ఇదుందని విర్రవీగొద్దు. హౌస్ లో అందరూ సమానమే. నా కొడుకు ఒకసారి లవ్ సాంగ్ చేస్తే రూ. 7లక్షలు వచ్చాయి. ఆ డబ్బులను నా కొడుకు స్నేహితులు తీసుకుని మోసం చేశారు. అప్పుడు నా కొడుకు చాలా ఏడ్చాడు. ఒక రోజైతే చస్తా అని పొలం దగ్గరకు వెళ్ళాడు. నీకే కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పిన. అప్పుడు ఫోన్ కొనిస్తే రీల్స్ చేసుకున్నాడు. ఫోన్ కొనిచ్చిన, రిల్స్ చేసుకుంటూ ఫేమస్ అయ్యాడు.. కానీ ఏదో ఒకటి చేయాలని తిండి తిప్పలు లేకుండా తిరిగాడు. బిగ్ బాస్ కి వెళ్ళాడు.

నాగార్జున సార్ ను కలిశాడు మాకు అదే సంతోషం. ప్రశాంత్ కు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ తనకు ముందు సెటిల్ అవ్వాలని ఉంది. సెటిల్ అయినా తర్వాత పెళ్లి చేసుకుంటా అని.. మళ్లీ ఆ ప్రస్తావన తీస్తే ఇంట్లోకి రానని అన్నాడు. అందుకే ఊరుకున్నాం. బిగ్ బాస్ నుంచి వచ్చాక పెళ్లి చేస్తాం. రతిక మా కొడుకుని వాడుకుంది. ప్రశాంత్ తో ఉంటే అతడికొచ్చే ఓట్లు తనకు కూడా వస్తాయని అనుకుని వాడుకుంది అంతే. ప్రశాంత్ అందరినీ అక్క, చెల్లి అనుకుంటూనే మాట్లాడుతాడు. తను ఎటువంటి దురాలోచన చేయడు ” అంటూ చెప్పుకొచ్చారు ప్రశాంత్ తల్లి.