ప్రశాంత్ రైతు బిడ్డ అని చిన్నచూపు చూస్తున్నారు… కంటెస్టెంట్స్ పై ఫైర్ అయిన అఖిల్(వీడియో)

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ 7 రెండో వారం నామినేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి. రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్‌ని.. సీరియల్ బ్యాచ్ అంతా నామినేట్ చేశారు. ముఖ్యంగా అమర్ దీప్ అరేయ్, రా అంటూ కాస్త హద్దు దాటి మాట్లాడాడు. కానీ ప్రశాంత్ మాత్రం నోరు జారకుండా అన్నా అంటూ మర్యాద ఇచ్చాడు. తాజాగా ఈ వ్యవహారంపై బిగ్ బాస్ రన్నరప్‌ అఖిల్ సార్థక్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు. అఖిల్ మాట్లాడుతూ.. పల్లవి ప్రశాంత్ కు అందరూ భయపడుతున్నారు. అందరూ అతడిని టార్గెట్ చేశారు. రైతు బిడ్డ నువ్వు స్ట్రాంగ్ గా ఉండు.

ఆర్టిస్టులమైన మనకే బిగ్ బాస్ అంటే ఎంతో ఎగ్జయిట్ంగా ఫీలవుతాము. ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడతాం. అలాంటిది ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అతను ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంబరపడ్డాడు. హౌస్ లో ఉన్న అందరిలాగే ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో తప్పేం ఉంది. కొందరైతే పల్లవి ప్రశాంత్ గురించి అధ్యయనం చేసి మరీ వచ్చారు. కానీ.. అతడు మిగతా కంటిస్టెంట్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. తన ఆట తాను ఆడేందుకు వచ్చాడు. నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ను చూస్తే బాదేసింది.

ఎవరు అతడిని మాట్లాడనివ్వడం లేదు. పైగా కొందరు అరేయ్, రా.. అంటూ వల్గర్ గా మాట్లాడుతున్నారు. అతను ఒక రైతు అని చులకన చేస్తున్నారు. చాలా చిన్న చూపు చూస్తున్నారని అనిపించింది. అందరూ తనను డామినేట్ చేస్తున్నారు. ఉల్టా పుల్టా సీజన్స్ అంటే అందరూ మాట్లాడుతారు కానీ.. అతడిని మాత్రం మాట్లాడనివ్వరన్నమాట? వాళ్లు చెప్పే పాయింట్స్ కరెక్ట్.. కానీ అతడిని మాట్లాడనివ్వకపోవడం అస్సలు కరెక్ట్ కాదు. వీళ్ళందరూ ఫుటేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సీజన్ నిజంగా ఉల్టా పుల్టా” అంటూ అఖిల్ ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా స్ట్రాంగ్ గా ఉండే రైతు బిడ్డ జై జవాన్.. జై కిసాన్ అని క్యాప్షన్ జత చేశాడు.