తెలుగు రాష్ట్రాల్లో ” యానిమల్ ” డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకుంది ఎవరో తెలుసా..?

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న మూవీకి ” యానిమల్ ” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సినిమాలో రణబీర్ కపూర్ సరసన టాలీవుడ్ బ్యూటీ రష్మిక నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ మేరకు… టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజ్ తెలుగు రాష్ట్రాల్లో ” యానిమల్ ” డిస్ట్రిబ్యూషల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుంచి వెళ్లడయ్యే అవకాశం ఉంది. యానిమల్ డిసెంబర్ 1, 2023న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్ ఈ సినిమాలో ఇంటెన్సివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని భూషణ్ కుమార్, టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజై ఎటువంటి టాక్ సంపాదిస్తుందో చూడాలి.