ఆ నలుగురు హీరోలతో సినిమాలు తీయాలి.. డైరెక్టర్ అట్లీ కామెంట్స్ వైరల్..!

ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ డైరెక్టర్‌గా అట్లి పేరు మారుమోగిపోతుంది. జవాన్ సినిమాతో విజయం అందుకుని టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ. ఇక ఈ సినిమా ప్రస్తుతం రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌లో అనేక ఇంటర్వ్యూలో పాల్గొంటున్న అట్లీ ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

తను ఏ ఏ హీరోలతో సినిమాలు రూపొందించాలనుకుంటున్నాడు అనే అంశంపై స్పందించిన అట్లీ మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, రన్బీర్ కపూర్ లతో కలిసి పనిచేయాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు. ముందుగా సల్మాన్, రన్‌బీర్‌ల‌తో సినిమాలు రూపొందించాలని చెప్పాడు. జవాన్ సినిమా విషయంలో దేవుడి ఆశీస్సులు నాపై ఉన్నాయని.. మంచి స్క్రిప్ట్ రాయగలిగేలా ఆయన చేశాడంటూ వివరించాడు. అది స్క్రిప్ట్ పక్కగా ఉండడంతోనే మిగతా పనులు సజావుగా సాగాయని అట్లీ వివరించాడు.

 

మరో ఇంటర్వ్యూలో వరుస విజయాలు సాధించడం పై స్పందిస్తూ నేను రచయితల దర్శకుడిగా సినిమా రాయను ఓ అభిమానిగా సినిమాను తెరకెక్కిస్తా.. వ్యక్తికి అభిమానిని కాదు.. సినిమాకి అభిమానిని.. ఓ సినిమాలో అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి నా దగ్గర ఎలాంటి ఫార్ములా లేదు. ఏది బాగుందనిపిస్తే అదే చేస్తా నా జీవితంలో నేర్చుకున్న విషయాలనే సినిమాల్లో చూపిస్తా.. నా కుటుంబం నా చుట్టూ ఉండే వ్యక్తుల నుంచి నేను గమనించిన విషయాలను సినిమాగా రూపొందించా అదే నా విజయం వెనుక రహస్యం అని చెప్పాడు.