అధిక బరువుతో ఇబ్బంది ప‌డుతున్నారా…. అయితే ఈ సింపుల్‌ చిట్కా మీకోసం..!!

ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక బరువుకు కోట్లాదిమంది బానిసలుగా ఉన్నారు. అధిక బరువు శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంది. చాలామంది తాము లావుగా ఉన్నామని తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఒత్తిడిని పెంచుకొని డిప్రెషన్ లోకి వెళ్లి పోతున్నారు. డిప్రెషన్ వల్ల బరువు మరింత పెరుగుతారే తప్ప తగ్గరు. కాబట్టి ముందు డిప్రెషన్ పడకుండా జాగ్రత్త వహించండి. ఇక బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నట్లే తగ్గడానికి సైతం మరెన్నో మార్గాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పొడిని ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎంత లావు ఉన్నా సరే దెబ్బకు సన్నగా అయిపోతారు. ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నాలుగు మిరియాలు, ఐదు యాలుకలు, రెండు దాల్చిన చెక్క, వన్ టేబుల్ స్పూన్ శొంఠ పొడి వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి. ఇది ఖాళీ కడుపుతో ఎలా తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ కాస్త హీట్ అవ్వగానే తయారుచేసి పెట్టుకున్న పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. అలాగే రెండు లేదా మూడు లెమన్ స్లైసెస్ వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆపై స్టైస‌ర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకొని ఖాళీ కడుపుతో తాగేయడమే. ఈ విధంగా ప్రతిరోజు కాళీ కడుపుతో చేస్తే కచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు.