ఆ స్టార్ కమెడియన్ తో శ్రీదేవి అంతలా రొమాన్స్ చేసిందా….!!

ఇప్పుడు ప్రతి స్టార్ హీరో, హీరోయిన్ ఒకటి రెండు సినిమాలు ఇతర భాషల్లో క్లిక్ అవ్వగానే పాన్ ఇండియా హీరో, హీరోయిన్స్‌గా ఊహించేసుకుంటున్నారు. నిర్మాతల ముందు బడాయి చూపిస్తూ ఇష్టం వచ్చినంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ పాన్ ఇండియా అనే పదానికి అసలు సిసలు నిర్వచనం చెప్పిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి. ఈమె బాలనటిగా కెరీర్‌ని ఆరంభించింది. ఆ తరువాత 16ఏళ్ళ‌ వయసులోనే హీరోయిన్ గా మారి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలు అందరి సరసన హీరోయిన్గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

అతి త‌క్కువ‌ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు క్యూ కట్టాయి. అక్కడ కూడా ప్రముఖ స్టార్ హీరోలతో నటించి తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ఈ స్థాయికి ఎదిగిన శ్రీదేవి కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. హీరోయిన్ కాకముందు కొన్ని చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చింది. అలా 1975వ సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన “దేవుడు లాంటి మనిషి”అనే సినిమాలో న‌టించింది.

ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ రాజబాబుకి జోడిగా శ్రీదేవి నటించింది. అంతేకాదు వీళ్ళిద్దరి మధ్య ఓ డ్యూయెట్ సాంగ్ కూడా ఉండడం విశేషం. అప్పట్లో ఈ పాట పెద్ద హిట్ అయింది. ఇలా కమెడియన్‌తో కూడా శ్రీదేవి రొమాన్స్ చేసింది అనే విషయం తెలుసుకొని అందరూ షాక్ అయ్యారు. అలా శ్రీదేవి కూడా కెరీర్ ప్రారంభంలో ఇలాంటివన్నీ చూసేసి వచ్చిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.