టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకున్నాము అనే విషయాన్ని మర్చిపోయి, ఎవరి కెరీర్ని వాళ్లు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. రీసెంట్గా ట్రెండింగ్ అవుతున్న ఒక వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత అఖిల్తో బాగా క్లోజ్గా ఉంటూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అఖిల్ తర్వాత నాగచైతన్య తల్లి దగ్గుపాటి లక్ష్మీతో సమంతా కి మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్ళిద్దరూ ఇప్పటికీ కలుసుకుంటూనే ఉంటారట. సమంత ఇప్పటికీ అమెరికాకి వెళ్ళినప్పుడల్లా దగ్గుపాటి లక్ష్మిని కలిసి వెళుతుందట. అంత మంచి బాండింగ్ వీళ్ళిద్దరి మధ్య ఉందట. అయితే రీసెంట్ గా ఈమె లక్ష్మిని కలిసినప్పుడు నాగచైతన్యాన్ని తలుచుకుని బాగా ఏడ్చేసిందట.
ఆ ఇంట్లో ఉండే మనుషులు మొత్తం విచిత్రమైన వాళ్ళని, ఎప్పుడు ఎలా ఉంటారో.. ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదని ఒకానొక సమయం నా స్వేచ్చని మొత్తం పోగొట్టుకుని జైల్లో ఉన్నట్లు ఫీలింగ్ కలిగిందని.. ప్రతి విషయంలో ఆంక్షలు పెట్టేవారని, ముఖ్యంగా అమల పెట్టే కండిషన్స్ని నేను తట్టుకోలేకపోయేదాన్ని.. ఆమె ప్రభావం నాగచైతన్య మీద కూడా పడి ఆయన కూడా సమంతని అపార్థం చేసుకోవడం మొదలు పెట్టారట.. ఆలా మా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.. మేము విడిపోవలసి వచ్చింది అంటూ సమంత ఏడుస్తూ లక్ష్మికి చెప్పుకుందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.