ముఖేష్ అంబానీ ఫ్యామిలిలో ఫ‌స్ట్ ల‌వ్ మ్యారేజ్ చేసుకుంది ఎవ‌రో తెలుసా..!!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అంబానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్తలు అంటే ఫ్యామిలీ ఫంక్ష‌న్స్‌, వ్యాపారానికి సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. అంబానీ సోదరీమణులు.. అంటే ధీరూభాయ్ అంబానీ కుమార్తెల గురించి అంతగా ఎవరికి తెలియదు. అతనికి ఇద్దరు కుమారులు ముఖేష్, అనిల్ మాత్రమే కాకుండా ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ లైమ్‌లైట్‌కి దూరంగా ఉంటారు.

అందుకే వారి గురించి సమాచారం బయటకు రాదు. ముఖేష్, అనిల్ అంబానీ సోదరీమణుల పేర్లు నీనా కొఠారి,దీప్తి సల్గవ్శర్. 1986లో హెచ్‌సి కొఠారీ గ్రూప్ చైర్మన్ భద్రశ్యమ్ కొఠారి – నీనా వివాహం జరిగింది. భద్రశ్యమ్ క్యాన్సర్ కారణంగా 2015లో మరణించారు. హెచ్‌సి కొఠారీ గ్రూప్ ప్రధానంగా చక్కెర, కెమికల్, పెట్రోమికల్ వ్యాపారంలో ఉంది. నీనాకు కూతురు నయనతార, కొడుకు అర్జున్ కొఠారి ఉన్నారు. వీరిద్దరికి పెళ్లయింది. నయనతార కేకే బిర్లా మనుమడు షమిత్‌ని వివాహం చేసుకుంది. ఆమె ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగింది. అంబానీ కుటుంబంలో జరిగే ప్రతి ఫంక్షన్‌కి నీనా హాజరవుతుంటారు.

అంబానీ కుటుంబంలో మొదట దీప్తి ప్రేమ వివాహం చేసుకుంది. దీప్తికి 1983లో దత్తరాజ్ సల్గాంకర్ తో వివాహం జరిగింది. ప్రీతి తండ్రి ధీరుభాయ్.. రాజ్ తండ్రి వాసుదేవ్ సల్గాంకర్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఓకే భవనంలో ఉండేవారు. దత్తరాజ్ సల్గాంకర్, ముఖేష్ అంబానీ మంచి స్నేహితులు. దీప్తి – సల్గాంకర్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి గోవాలో ఉంటుంది. ఆమె భర్త దేశంలోని ప్రముఖ ఫుట్ బాల్ జట్టు సల్గాంకర్ యజమాని. అలాగే ఖనిజ మైనింగ్, ఇనుప ఖనిజం ఎగుమతి, రియల్ ఎస్టేట్, ఆరోగ్య రంగానికి చెందిన వీఎం సల్గాంవ్శర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు యజమాని.

ధీరూభాయ్ అంబానీ 1978లో ముంబైలోని ఉషాకిరణ్ సొసైటీలోని 22వ అంతస్తులు ఉండేవారు. ఈ భవనంలోని 14వ అంతస్తులు వ్యాపారవేత్త బాసుదేవ్ సల్గాంవ్క‌ర్ తన కుటుంబంతో కలిసి ఉండేవారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఒకళ్ళ ఇంటికి ఒకరు వస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే రాజ్, ముఖేష్ అంబానీ మంచి స్నేహితులయ్యారు. తరువాతి కాలంలో రాజ్ సల్గాంక‌ర్‌… ముఖేష్ సోదరి దీప్తితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే వారు పెళ్లికి అంగీకరించారు. దీప్తి, రాజ్ ల‌ వివాహం 1983లో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కొడుకు విక్రమ్, కూతురు ఇషేత.