డీజే టిల్లు సిద్ధు కొత్త సినిమా..!

డిజె టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలయ్యింది. బాపినీడు బి సమర్పణలో ఎస్ వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న 37వ సినిమా గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్త సమయానికి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా నిర్మాత అల్లు అరవింద్ క్షాప్ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాత‌ ప్రసాద్ మాట్లాడుతూ “భాస్కర్ దర్శకత్వంలో సిద్దుతో మా బ్యానర్‌పై సినిమా చేయటం ఎంతో సంతోషంగా ఉంది.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలాగా చిత్రం ఉంటుంది. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలన్నీ త్వరలోనే తెలియచేస్తాం” అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో నిర్మాతలు వై. రవిశంకర్, వంశీ, దామోదర్ ప్రసాద్, రాధా మోహన్, మిరియాల రవీంద్ర రెడ్డి, రచయిత కోన వెంకట్, డైరెక్టర్ నందిని రెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్