ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ విడాకులకు ఆ ఇంటికి సంబంధం ఏంటి… బయటపడ్డ సంచలన నిజాలు..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య లు విడాకులు తీసుకున్నట్లు సుమారు రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. ఆపై వీరిద్దరూ ఎవరికివారు దూరంగా ఉంటున్న విషయం అందరికీి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధంతో కలిసి ఉన్న ధనుష్- ఐశ్వర్యాలు ఈ నిర్ణయం తీసుకోవడం సౌత్ చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇలాంటి నిర్ణయం వారు ఎందుకు తీసుకున్నారు అనేది బహిరంగంగా వారిద్దరిలో ఎవరు చెప్పలేదు కానీ వీరిద్దరి విడాకులకు కారణం ధనుష్ కట్టుకున్న ఇల్లే అని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

ధనుష్ చెన్నైలోని పోయేస్ గార్డెన్ లో రు. 150 కోట్లతో కొత్త ఇంటిని నిర్మించిన విషయం తెలిసిందే.. ఆ ఇంటిని నిర్మించే సమయంలోనే ధనుష్‌కు సూపర్ స్టార్ రజిని ఒక సలహా కూడా ఇచ్చారట. మీరు ఇంటిని ఈ ప్రాంతంలో కాకుండా మరో ప్లేస్ లో నిర్మించుకునేందుకు ప్లాన్ చేయమని రజనీకాంత్ కూడా సలహా ఇచ్చారట. రజిని అలాంటి సలహా ఇవ్వడానికి ముఖ్య కారణం వాస్తు, జ్యోతిష్యం పట్ల ఆయనకున్న విశ్వాసం.. అంతేకాకుండా ఆ ఇల్లు అక్కడ నిర్మించితే కుటుంబంలో కష్టాలు వస్తాయని ఎవరూ కలిసి ఉండరని ఎవరో ఒకరు విడిపోయే పరిస్థితి వస్తుందని రజిని ముందే ఊహించి వద్దన్నారట.

కానీ అవేమీ పట్టించుకోకుండా అక్కడే తన మామ రజనీకాంత్ ఇంటికి సమీపంలోనే ధనుష్ త‌న కొత్త ఇంటిని నిర్మించి 2023లో గృహప్రవేశం కూడా చేశాడు. అయితే ఈ ఇంటి పనులు ప్రారంభించిన‌ కొద్ది నెలల్లోని ధనుష్- ఐశ్వర్యల మధ్య గొడవలు రావడం మొదలయ్యాయట. తన తండ్రి కంటే అంత పెద్ద ఇల్లు కట్టడం ఎందుకని ఐశ్వర్య ధనుష్‌తో గొడవకు దిగేదట. దాంతోపాటు ఐశ్వర్య డైరెక్టర్- నిర్మాత కావటంతో ఆమె చేసిన సినిమాలో ఫ్లాఫ్‌య్యాయి.. ఆర్థికంగా కూడా బాగా నష్టపోవటం ధనుష్‌కి ఏమాత్రం ఇష్టం లేదని అలా వారిద్దరి మధ్య గొడవలు చినికి చినికి పెద్దవి అయ్యాయని ప్రచారం కూడా జరిగింది.

దానికి తోడు ధనుష్ మరో హీరోయిన్ అమలాపాల్‌కు దగ్గర అయ్యాడు అంటూ వార్తలు కూడా రావడంతో ఐశ్వర్య విడాకులు వరకు వెళ్లిందనే మరో ప్రచారం కూడా జరిగింది. ఇక ఇక్కడ ఏది ఏమైనా రజినీకాంత్ చెప్పిన దాని ప్రకారం అక్కడ ఇల్లు కడితే వాస్తు పరంగా కలిసి రాదని చివరికి అదే నిజమైందని అంటున్నారు. ఈ విధంగా వారిద్దరి మధ్య దూరం పెరిగి విడాకులు వరకు వెళ్లారని కోలీవుడ్ లో ప్రచారం ఒప్పోందుకుంది. ధనుష్ తన ఇంటిని 2021లో ప్రారంభిస్తే మొదలైన సంవత్సరానికి వీరిద్దరూ విడిపోయారు. తర్వాత 2023లో ధనుష్ తన తల్లిదండ్రులతో ఆ ఇంట్లో అడుగు పెట్టాడు.