చిరంజీవి హీరోయిన్ సమీరా రెడ్డికి కూడా తప్పలేదుగా బాడీ షేమింగ్.. చివరికి వారితో కూడా అనిపించుకుందా..!

స్టార్ యాక్ట్రెస్ సమీరా రెడ్డి నరసింహుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. జై చిరంజీవి సినిమాలో భూమికతో పాటు మరో హీరోయిన్గా నటించిన సమీరా రెడ్డి ఈ సినిమా ద్వారా పాపిలారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత అశోక్ సినిమాలో నటించిన సమీరా రెడ్డి తర్వాత కొంత కాలం తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఇక 2012లో రాన దగ్గుబాటి హీరోగా తరికెక్కిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ.

సమీరా రెడ్డి తెలుగులోనే కాక తమిళ‌, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈమె పై గతంలో ఎన్నో రకాల న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అంటూ వచ్చిన వార్తలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది స‌మీరా. ఆమె మాట్లాడుతూ పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యానన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని మేము పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నామని వివరించింది.

బాబు పుట్టాక బరువు బాగా పెరిగానని చెప్పుకొచ్చిన సమీరా నా బాడీ షేప్స్ కోల్పోవడంతో చుట్టుపక్కల వాళ్లతో పాటు కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా దిదీ మీకేమయింది అని కామెంట్స్ చేశాడని చెప్పుకొచ్చింది. అలాంటి వారి కామెంట్స్ కు భయపడి బయటకు వెళ్లడం మానేశానంటూ వివరించింది. ప్రస్తుతం సమీరా రెడ్డి కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.