ఇటీవల ఆనంద్ దేవరకొండకి జంటగా బేబీ సినిమా హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ తెలుగు అమ్మాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోతుంది. ఈ సినిమా వల్ల వైష్ణవి చైతన్య చాలా నష్టపోయిందట. అప్పటివరకు జూబ్లీహిల్స్ లో తన ఫ్యామిలీతో ఆనందంగా గడిపింది వైష్ణవి.
ఈ సినిమా అగ్రిమెంట్ పై సంతకం పెడుతూ ఏడ్చేసిందని ఏదైతే అదే కానీ ఓ ధైర్యంతో ఓ స్టెప్ ముందుకివేసిందని సమాచారం. మూవీ ఒప్పుకున్నాక తన జాబ్ కూడా వదిలేయడంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసిందట. దీంతో డైరెక్టర్ సాయి రాజేష్ వైష్ణవి పట్టుదల చూసి ఈ మూవీ కోసం చాలా కష్టపడుతుంది దీని కారణంగా కెరీర్ ఎక్కడ నాశనం అవుతుందో అని కంగారుపడ్డాడని కానీ దేన్నీ లెక్కచేయకుండా సినిమా కంప్లీట్ చేసి మొత్తానికి స్టార్ హీరోయిన్గా వైష్ణవి గుర్తింపు తెచ్చుకుంది. బేబీ సినిమా హిట్ అయినా హీరోయిన్ వైష్ణవి ముఖంలో సంతోషం లేదట.
మొదటి సినిమా హిట్ అయిన వరుస అవకాశాలు అందుకుంటున్నా వైష్ణవి చైతన్యకు ఎక్కడో చిన్న టెన్షన్ ఉందట. ఆమె తర్వాత సినిమా హిట్ కాకపోతే మళ్లీ ఆమె పరిస్థితి మొదటికి వస్తుందని భయపడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు వస్తున్న అవకాశాలన్నీ రొమాంటిక్ సినిమాలే కావడం మళ్ళీ రొమాంటిక్ సినిమాలోనే నటిస్తే నాకెరీర్ కూడా పాయల్ రాజ్పుత్ లాగా అయిపోతుందేమో.. కేవలం నన్ను నెగటివ్ రోల్స్ అయితేనే సెట్ అవుతానని డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఫిక్స్ అవుతారేమో.. అని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె నటించబోయే రెండో కథ గురించి ఆచితూచి అడుగులు వేస్తుందట.