పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన యోగి సినిమా ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. నిన్న ఈ సినిమా రిలీజైన సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ ధియేటర్స్ వద్ద చేసిన రచ్చ మామూలుగా లేదు. సినిమా రిలీజ్ సందర్భంగా సంబరాలు చేసుకుంటూ ఎంజాయ్ చేసారు. రాజ్ థియేటర్ స్క్రీన్ దగ్గర డాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో స్క్రీన్ మీద పడిపోయారు.
దాంతో రెండు చోట్ల స్క్రీన్ చినిగిపోయింది. దీంతో యాజమాన్యం ఆగ్రహానికి గురయారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా శ్రీ ప్రియ థియేటర్స్ వద్ద కూడా ఇదే సంఘటన చోటుచేసుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తమ సంబరాల్లో మునిగిపోయి ఆనందంతో ఏం చేస్తున్నారో కూడా తెలియనట్లుగా బిహేవ్ చేశారు. స్క్రీన్ను చింపేశారు దానికి తోడు కొన్ని కుర్చీలను కూడా ధ్వంసం చేశారు.
ఆ థియేటర్ నీ కొంతకాలం క్రితమే చాలా ఖర్చు చేసి బాగు చేయించారట. అలాంటి టైం లో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లో కుర్చీలను ధ్వంసం చేసి స్క్రీన్ చింపేయడంతో యాజమాన్యం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ థియేటర్ యజమానులు ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు ఏం జరిగిందని అంశంపై ఎంక్వయిరీ మొదలుపెట్టారు.