ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చాలామంది సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ గుర్తింపు సంపాదించుకున్నారు. అక్కినేని నాగచైతన్య-సమంత విడాకుల తర్వాత ఈయన మరింత ఫేమస్ అయ్యాడు. వారిద్దరూ విడిపోతారంటూ పెళ్లి సమయంలోనే వేణు స్వామి వెల్లడించాడు.
నిజంగా అదే జరగడంతో వేణు స్వామిని చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సైతం ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటారు. జాతకాలు మాత్రమే కాక.. సెలబ్రిటీల చేత ప్రత్యేక పూజలు కూడా చేస్తాడు వేణుస్వామి. గతంలో రష్మిక మందన్నతో వేణు స్వామి ఓ యాగం చేయించారు.
తాజాగా ప్రముఖ హీరోయిన్ నిధి ఆగర్వాల్ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు చేయించారు. నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు చేస్తోన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోయి కెరీర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగేలా నిధి అగర్వాల్ చేత వేణు స్వామి రాజ శ్యామల పూజ చేయించినట్లు తెలుస్తోంది. కాగా, సవ్యసాచి మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన నిధి.. ప్రస్తుతం పవన్ తో `హరిహర వీర మల్లు` అనే సినిమా చేస్తోంది. అలాగే తమిళంలో మరికొన్ని ప్రాజెక్ట్ లకు కూడా నిధి సైన్ చేసింది. తెలుగుతో పాటు తమిళంలో సత్తా చాటాలని నిధి తెగ ప్రయత్నిస్తోంది.
https://twitter.com/DailyCultureYT/status/1640390744316825601?s=20