Prabhas: మళ్లీ అనారోగ్యానికి గురైన ప్రభాస్.. టెన్షన్లో అభిమానులు..!!

తెలుగు సినీ పరిశ్రమలో పాన్ ఇండియా హీరోగా మంచి పాపులారిటీ అందుకున్నారు ప్రభాస్. ప్రభాస్ పైన గత కొద్దిరోజులుగా పెళ్లి రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఆరోగ్యం పైన కూడా కొన్ని వద్దాంతులు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరొకసారి ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. బాలీవుడ్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రభాస్ ఆరోగ్యం సరిగ్గా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా రేంజ్ లో తన క్రేజీ సంపాదించుకున్నారు.

ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు తనని మరొక లెవల్ కి తీసుకువెళ్తాయని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న ప్రభాస్.. అనారోగ్యానికి గురయ్యారు అనే విషయం అభిమానులకు తెలియగానే కాస్త షాక్ గురవుతున్నారు. ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ క్రమంలోనే మళ్లీ ప్రభాస్ ఆరోగ్యం క్షీణించిందని వార్తలు బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. దీంతో వరుస సినిమా షూటింగ్లకు కాస్త బ్రేక్ వేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

నిన్నటి రోజున అర్ధరాత్రి నుంచి ప్రభాస్ ఆరోగ్యం బాగాలేదని ఈ కారణంగానే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్ళబోతున్నట్లు ప్రభాస్ సన్నిహితుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. అభిమానులు మాత్రం అసలు ఇది నిజమేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఎందుకంటే టాలీవుడ్ మీడియా స్టార్ హీరోల పైన ఎలాంటి విషయం జరిగిన కచ్చితంగా రియాక్షన్ ఇస్తూ ఉంటుంది కానీ ఈ విషయంపై ఏ విధంగా రియాక్షన్ కాలేదు దీంతో ఈ విషయం కేవలం బాలీవుడ్ మీడియా కుట్రపూరితంగానే చేస్తోందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి మరి అసలు విషయం ఏంటన్నది తెలియాల్సి ఉంది.