SSMB -29: సినిమా విడుదల కాకుండానే రికార్డ్ సృష్టిస్తున్న మూవీ..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్లో అగ్ర హీరోగా పేరుపొందారు. ప్రస్తుతం మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా అని తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమా అయిపోయిన వెంటనే దర్శక ధీరుడు రాజమౌళితో 29 వ సినిమాలో నటించబోతున్నారు.ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ సినిమా నటిస్తున్నారని తెలియడంతో అభిమానులు చాలా సంతోషపడ్డారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నానని అందుకోసం స్క్రిప్ట్ వరకు కూడా సిద్ధం చేస్తున్నట్లుగా ఎన్నోసార్లు అప్డేట్ ఇవ్వడం జరిగింది.

SSMB 29 Release Date, Star Cast, Makers, Genre, Budget & More Details -  JanBharat Times
భారీ అడ్వెంచర్ కథ మహేష్ కోసం సిద్ధమవుతోందనీ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నది.ఇప్పటివరకు ఈ సినిమా పైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సిల్వర్ స్క్రీనుపై ఇంతవరకు రానటువంటి కథాంశంతో రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. SSMB -29 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మరి కొన్ని నెలల రాబోతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది .ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడానికి ముందే క్రేజీ ప్రాజెక్టు పైన గ్లోబల్ వైడ్ గా ఆడియో మహేష్ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో భాగంగా రాజమౌళిని కలిసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య మహేష్ మూవీ ఓటిటి డీల్ కు సంబంధించి చర్చ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అన్ని భాషలలో కలిపి డిజిటల్ రైట్స్ ను అందుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ సినిమా రైట్స్ ను దాదాపుగా రూ.145 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.