తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరిగా సర్కారు వారి పాట సినిమాలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తన 28వ సినిమానీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో శ్రీ లీల కూడా నటించబోతోంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కించే విధంగా డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్ కూడా యాడ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే మహేష్ ఫ్యాన్స్ కి కిచ్చే అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైక ఆరోరాను ఎంపిక చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పాట కోసం ఆమెను సంప్రదించేందుకు చిత్ర బృందం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి మలైకా తెలుగులో పలు స్పెషల్ సాంగుల్లో నటించింది. గతంలో అతిథి సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో నటించింది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా అలరించింది. టాలీవుడ్ లో చేసిన స్పెషల్ సాంగ్లో మలైకావి అన్ని సూపర్ హిట్ అన్న సంగతి చెప్పవచ్చు.. చాలా కాలం తర్వాత మహేష్ తో మరొకసారి ఆడి పాడనున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ వార్తలలో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే ఈ విషయంపై చిత్ర బృందం స్పందిస్తుందేమో చూడాలి మరి.ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.