అనసూయ యాంకర్ కాకముందు ఏం చేసేదో తెలుసా..?

బుల్లితెరపై యాంకర్ అనసూయ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.. బుల్లితెరపై పలు కామెడీ షోలు వచ్చిన తర్వాత యాంకర్స్ కి బాగా పాపులారిటీ పెరిగిపోయింది. అలా గతంలో ఝాన్సీ, ఉదయభాను, సుమ వంటి వారు మాత్రమే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అంతటి రేంజ్ సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ పేరు వినిపిస్తూ ఉంటుంది. దాదాపుగా ఇప్పటికీ అనసూయ షో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.కానీ ఈ మధ్యకాలంలో అనసూయ జబర్దస్త్ మానివేయడంతో అభిమానులు కాస్త ఫీలవుతున్నారు.

Anasuya Bharadwaj: Times when the actress-TV personality shut down trolls  and voiced against age-shaming | The Times of India

అనసూయ సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె తల్లిదండ్రులు సుదర్శనరావు, అనురాధ దంపతులకు జన్మించింది. అనసూయకు వివాహమై ఇప్పుడు ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈమె అందంలో ఏమాత్రం హీరోయిన్లకు తీసిపోదని చెప్పవచ్చు. జబర్దస్త్ షోలో ఎన్ని పంచులు వేసినా కూడా చాలా లైట్ గా తీసుకొని ఉంటుంది అనసూయ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలలో కూడా పలు పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.

Anasuya's Father Dies Of Cancer

మొదట అనసూయ హెచ్ఆర్ గా తన కెరియర్ను మొదలుపెట్టింది. ఆ తర్వాత యాంకర్ గా వచ్చిన అనసూయ సినిమాలలో కూడా తన నటనతో మెప్పించింది. అలా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అందరిని ఆకట్టుకుంది. అనసూయను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆమెను ఆర్మీలోకి పంపాలని తండ్రి సుదర్శన రావు అనుకునే వారట. అందుకే ఎన్సిసి లో చేర్పించారట. అనసూయ మాత్రం ఎయిర్ పోస్ట్ అవ్వాలని ఉండేదట. న్యూస్ రీడర్గా ఒక టాక్ షోలో చేస్తున్నప్పుడు.. రాంగోపాల్ వర్మతో ది సేల్ టాక్ షో తో మంచి పేరు సంపాదించింది. అనసూయ భర్త ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా పనిచేస్తున్నారు.