ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఎక్కడ ఏ వింత జరిగిన కొద్ది క్షణాల్లోనే అందరికీ తెలిసిపోతుంది. ప్రపంచంలోనే కాకుండా మన భారతదేశంలో కూడా ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం మనదేశంలోనే ఉన్న ఓ వింత ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఇక ఇది భారతదేశంలో లద్దాఖ్లో సింధూ నది ఒడ్డున కొన్ని వింత గ్రామాలు వింత ప్రజల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ దాదాపు 5 వేలకు పైగా బ్రోక్పా అనే జాతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు.
అక్కడున్నవారు ఆర్యుల వారసులమని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ మరో వింత కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం విదేశాల నుండి కొన్ని వేలమంది మహిళలు వచ్చి అక్కడున్న మగవారితో శృంగారంలో పాల్గొని గర్భం దాల్చి మళ్లీ వారి దేశానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆర్యులు అందంగా, పొడవుగా ఉంటారని.. వారితో కలిస్తే తమకు అలాంటి పిల్లలే పుడతారని విదేశీ మహిళల నమ్మకం. అందుకే ఆర్యలను పోలిన వారికి జన్మనిచ్చే ఉద్దేశంతో విదేశీయుల నుంచి మహిళలు వస్తుంటారని ఆ ప్రదేశాలని ప్రెగ్నెన్సీ టూరిజం అని కూడా పిలుస్తూ ఉంటారు.
జర్మనీ, డెన్మార్క్, పోలెండ్తో పాటు యూరప్ దేశాల నుంచి ఇక్కడకు వచ్చి ఆర్యులతో శృంగారం చేసి పిల్లలను కనే మహిళలు ఎక్కువ మంది ఉంటున్నారు. ఇక్కడికి వచ్చి గర్భం దాల్చటానికి ప్రధాన కారణం నివసించే ప్రజలు స్వచ్ఛమైన ఆర్యులు మని చెపుతారు. వారితో పడుకుని గర్భం దాలిస్తే అద్భుతమైన తెలివితేటలు కూడా వస్తాయన్నదే వారి నమ్మకం. ఆర్యులమని చెప్పే ఈ బ్రోక్పా ప్రజలు భారత సంతతికి చెందినవారు కాదని ఒక ప్రచారం కూడాా ఉంది.
వీరు ఇతర దేశాల నుంచి వచ్చి ఉంటారని విషయం ఇటీవల వారి డీఎన్ఏ పరిశోధనల్లో వెల్లడైంది. ఇక వీరు విశ్వ విజేత అలెగ్జాండర్ వారసులమని కూడా చెప్పుకుంటారు. ఇక ఈ వింత ప్రజలు ప్రస్తుతం భారతదేశంలోనే కాకుండా పాకిస్థాన్లో కూడా ఉన్నారు. అక్కడున్నవారికి ఇక్కడున్నా వారి సంప్రదాయాలలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వారి మాట్లాడే భాష కూడా ఎంతో ప్రాచీనంగా ఉంటుంది. వారి భాష మన సంస్కృతి భాషకు దగ్గరగా ఉంటుందని చెప్తుంటారు. వీరి గురించి చరిత్ర కారులు కూడా ఎన్నో పుస్తకాలలో వివరించారు.