టాలీవుడ్ లో హీరోయిన్ అతిలోకసుందరి అందం నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇక శ్రీదేవి కుటుంబం నుంచి పిన్ని కూతురు మహేశ్వరి కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మహేశ్వరి శ్రీదేవికి చెల్లెలు వరస అవుతుంది. ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంది మహేశ్వరి. దాదాపుగా ఈ మధ్యకాలంలో అసలు ఈ హీరోయిన్ ని చూసింది కూడా లేదు. ఎన్నో సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈమె కనీసం సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించదు.
తాజాగా జాన్వీ కపూర్ తో దిగినటువంటి కొన్ని ఫోటోలను జాన్వీ కపూర్ షేర్ చేయగా అందులో మహేశ్వరి ఇప్పుడు ఎలా ఉందో క్లారిటీగా కనిపిస్తోంది. జాన్వీ కపూర్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ తన ఆంటీ అంటూ రాసుకుంది. ఆ మధ్య తనకు ఇల్లు చూపించే సమయంలో మహేశ్వరుని పరిచయం చేసింది. ఆ సమయంలో సరిగ్గా మహేశ్వరి కనిపించలేదు కానీ తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు మహేశ్వరి చాలా క్లియర్ గా కనిపిస్తోంది.
మొదట చక్రవర్తి తో కలిసి గులాబీ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. మహేశ్వరి వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది. ముఖ్యంగా ఎక్కువ బరువు పెరగడం వల్ల ఆమె ఫేసులో చాలా మార్పు వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. గతంలో ఉన్న అమాయకత్వం, అందం ఇప్పుడు ఆమె ఫేసులో కనిపించలేదు. ప్రస్తుతం మహేశ్వరి కి సంబంధించి ఈ ఫోటోలు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి అలనాటికీ హీరోయిన్స్ అందరూ సెకండ్ ఇన్నింగ్స్ పేరుతో సినిమాలలో వాళ్ళు క్యారెక్టర్లలో నటిస్తున్నారు మరి మహేశ్వరి కూడా ఇలానే చేస్తుందేమో చూడాలి మరి.
View this post on Instagram