ప్రముఖ నటి ఇంట్లో దొంగతనం.. షాక్ లో అభిమానులు..!!

ప్రముఖ సీనియర్ నటి వినయ్ ప్రసాద్ అప్పట్లో హీరోయిన్గా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు తాజాగా ఇమే ఇంట్లో దొంగలు పడి లాకర్లో ఉన్న డబ్బును మొత్తం దోచుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. నటి వినయ్ ప్రసాద్ ఎన్నో తెలుగు,తమిళ్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఇంద్ర, ఆంధ్రుడు దూకుడు తదితర చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది.

Paaru actress Vinaya Prasad creates awareness on Covid-19 spread; watch  video - Times of India
బెంగళూరులోని నందిని లే అవుట్ నివాసంలో ఉంటున్న వినయ్ ప్రసాద్ దీపావళి పండుగ సందర్భంగా ఉడిపి వెళ్లిందట. ఇలా దీపావళి పండుగను ఆ ఊరిలో జరుపుకొని తిరిగి అక్టోబర్ 26న బెంగళూరుకు వెళ్లిన ఈమె తన ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగినట్లు తెలుస్తోంది. దొంగలు తన ఇంటిని తాళం పగల కొట్టి ఇంట్లో లాకర్లో ఉన్న డబ్బులను దొంగలించి తీసుకువెళ్లారని ఈమె ఫిర్యాదులు తెలియజేసినట్లుగా సమాచారం. ఇలా తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది.

ಬಹುಭಾಷಾ ಹಿರಿಯ ನಟಿ ವಿನಯ ಪ್ರಸಾದ್ ಮನೆಯಲ್ಲಿ ಕಳ್ಳತನ - themangaloremirror.in

అయితే దొంగతనం జరిగిన మూడు రోజులకు ఈ విషయం బయటికి రావడంతో అటు అభిమానులు కాస్త నిరుత్సాహ చెందారు. అక్టోబర్ 26వ తేదీన 4:25 నిమిషాలకు ఇంటికి తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఈమె తన ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. దొంగలు ఎంత మేర డబ్బు దొంగలించారు నగలు ఇతరస్త్ర వస్తువులు ఏమైనా పోయాయా అనే విషయాలను తెలియజేయలేదు. ఈ క్రమంలో ఈ పని దొంగల ముఠా నేరస్తులు చేసినట్లుగా పోలీసులు విచారిస్తున్నారు.