కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ నట వారసురాలుగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరియర్ మొదటిలో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది. తర్వాత ఆమె కొంచెం లావుగా మారటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ బిజీ స్టార్ గా కొనసాగుతుంది. ఈమె సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల సినిమాలలో నటించి మెప్పిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో’క్రాక్’ సినిమాలో చేసిన నటన గాను మంచి ఇమేజ్ ని దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈమె అగ్ర హీరోల సినిమాలు నటిస్తూ బిజీగా మారిపోయింది.
తాజాగా ఈమె బాలకృష్ణ- గోపీచంద్ మలీనేని కాంబోలో వస్తున్న సినిమాలో ఒక కీలక పాత్రలో ఈమె నటిస్తుంది. గత కొద్దిరోజులుగా వరలక్ష్మీ శరత్ కుమార్ నాజుగ్గ సన్నబడింది. ఆమె సన్నబడిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ప్రేక్షకులు. ఆమెను మళ్లీ హీరోయిన్గా చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు హీరోయిన్గా చేయాలని ఉంది కానీ సినీమేకర్స్ అవకాశం ఇస్తార…? లేదా అనేది కొంత అనుమానంగా ఉంది.
తాజాగా వచ్చిన ఫోటోలు చూస్తే దర్శక నిర్మాతలు ఆమెని హీరోయిన్గా తీసుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.మరి చూడాలి వరలక్ష్మి శరత్ కుమార్ అందాన్ని చూసిన దర్శక నిర్మాతలు ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
View this post on Instagram