తెలుగు సినీ ఇండస్ట్రీలోకి లిడర్ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రీచా గంగోపాధ్యాయ. ఈమె చేసింది కొన్ని సినిమాలైనా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదట లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమెకు మిరపకాయి, మిర్చి, భాయ్ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. ఈమె ఢిల్లీకి చెందిన అమ్మాయి అయినా ఉన్నత చదువుల కోసం ఇమే అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఇమే సినిమాలకు దూరమయిందని వార్తలు వినిపించాయి.. ఇక చదువుతోపాటు మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.
2007లో మిస్స్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది రిచాగంగోపాధ్యాయ. మంచి సినిమా ఆఫర్స్ వస్తున్న కూడా ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ ఫారెన్ కి వెళ్ళిపోయింది.. అందు గల కారణం ఆమె చదువు అంటూ గతంలో వార్తలు వినిపించాయి. కానీ అది రీజన్ కాదు అన్నట్లుగా సమాచారం. ఈమె నటించిన హీరోలలో ఒక హీరో ఆమెతో మిస్ బిహేవియర్ గా ప్రవర్తించినట్లు సమాచారం. దాంతో ఈమె అతనిని కొన్ని వల్గర్ మాటలతో దూషించడం.. చెప్పుతో.. వంటి అనేక మాటలు అనడంతో సినీ అవకాశాలు రాలేదన్నట్లుగా సమాచారం.
సినిమా షూటింగ్ సమయంలోనే స్టార్ హీరో కార్ వ్యాన్ లో ఆమెతో అసభ్యకరంగా బిహేవియర్ చేయడమే కాకుండా.. ఆమెకు సంబంధించి కొన్ని వీడియోలను తన దగ్గర ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసి ఆమెను చాలా టార్చర్ పెట్టడట.ఆ హీరో. ఇలాంటి బాధలు భరించలేక ఈమె సినీ ఇండస్ట్రీకి దూరమైనట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తెలుగులోనే కాకుండా ఈమె తమిళంలో హీరో శింబు, ధనుష్ వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది. 2021లో ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కేవలం తన కుటుంబానికి సంతోషంగా గడపడానికి తన సమయాన్ని మొత్తం కేటాయిస్తోంది.