గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గురువారం శుభవార్త ని వినిపించింది. గురువారం నుంచి 19కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.91.50 ధర తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తిసుకున్నారు. .దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర 1885 రూపాయలకు తగ్గించారు.
గురువారం నుంచి కోల్కతాలో రూ.1995, ముంబయిలో రూ.1844, చెన్నై లో రూ.2045 ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ధరను తగ్గించారు. 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండరు ధరపై 91.5 రూపాయలు తగ్గించడంతో రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లకు కొంత ఊరట లభించింది. కాగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధర మాత్రం తగ్గించలేదు.