తెలుగు సినీ ఇండస్ట్రీలో చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు హీరో ఉదయ్ కిరణ్. ఇక దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ని బాగా హైప్ చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ వ్యక్తిగత జీవితం గురించి విషయానికి వస్తే కేవలం చిరంజీవి కూతురు సుస్మిత తోనే వివాహం బ్రేకప్ అయ్యిందని.. అందుచేతనే వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే వార్త తరచూ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు చిరంజీవి గురించి ఉదయ్ కిరణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి చూద్దాం.ఉదయ్ కిరణ్ సినిమాలు అన్ని వరుసగా హిట్ అవుతున్న సమయంలో చిరంజీవి ఉదయ్ కిరణ్ ను చాలా ప్రోత్సహించే వారట. అలా మనసంతా నువ్వే సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో ఆ రోజుల్లో ఉదయ్ కిరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో మీడియాలో కూడా ఉదయ్ కిరణ్ బాగా హైలైట్ గా నిలిచారు .దాంతో మనసంతా నువ్వే సినిమా హిట్ అవ్వగానే మొదటిసారిగా ఒక మీడియా సంస్థకు లేడీ జర్నలిస్టుతో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లినట్లుగా సమాచారం ఉదయ్ కిరణ్.ఆ తర్వాత వీరిద్దరి మధ్య మాటలు కలిసాయి. ఆ తర్వాత కొన్ని రోజులపాటు మాట్లాడుకునే వారట. అలా వీరిద్దరికీ తెలియకుండానే ప్రేమలో పడినట్లు సమాచారం అయితే కొన్ని రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ జర్నలిస్టుతో కేవలం ఏదో ఒక మాట తప్పుగా మాట్లాడాడని ఆమె ఉదయ్ కిరణ్ ను రిజెక్ట్ చేసి వెళ్లిపోయిందట. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ఆమె ఇంటికి వెళ్లి ఎంత బ్రతిమలాడినా కూడా ఒప్పుకోలేదట. దీంతో రెండు సంవత్సరాల పాటు ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లినట్లు సమాచారం. చిరంజీవి ఎన్నోసార్లు ఈ విషయాన్ని మరిచిపోమని.. కేవలం తన సినిమాల మీద ఫోకస్ చేయమని చెబుతూ ఉండేవారట. అలా మెల్లగా ఉదయ్ కిరణ్ ఆ విషయం నుంచి బయటికి రాగానే ఉదయ్ కిరణ్ పద్ధతులు నచ్చడంతో తన కూతురు సుస్మితాను ఇచ్చి వివాహం చేయాలని ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ వివాహం ఆగిపోయింది.