తెలుగు సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే విభిన్నమైనటుడుగా పేరుపొందాడు. ఇక మోహన్ బాబు నటుడు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. కానీ స్టార్ నటుడు, డైరెక్టర్ అయిన దాసరి నారాయణరావు ఈయన పేరును మోహన్ బాబు గా మార్చి స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మోహన్ బాబు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా బాగా పాపులర్ అయ్యారు. కేవలం నటుడు గానే కాకుండా నిర్మాతగా, విద్యాసంస్థల అధినేతగా కూడా పలు బాధ్యతలను చేపడుతున్నారు.మోహన్ బాబు కు మొదటి భార్య ఎవరనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఆమె ఎలా చనిపోయింది అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆయనకు విద్యాదేవి అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఇక వీరికి మంచు లక్ష్మి, మంచు విష్ణు ఇద్దరు జన్మించారు. అయితే అప్పట్లో మోహన్ బాబు వరుసగా సినిమాలు చేస్తూ ఉండడంతో చాలా బిజీగా మారిపోయారు. ఆ సందర్భంలోనే మోహన్ బాబు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. ఇంటికి తిరిగి వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతూ ఉండేదట. అయితే ఈ విషయం మాత్రం తన భార్య విద్యాదేవికి అసలు నచ్చేది కాదట ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య పలు మనస్పర్ధలు కూడా వచ్చాయని సమాచారం.ఇలా చిన్న చిన్న గొడవలు ఏకంగా ఒకరోజు చాలా తీవ్ర స్థాయికి వెళ్ళాయట దీంతో విద్య దేవి బలవస్మరణం చేసుకుంది. ఇక మొదటి భార్య మరణించిన తర్వాత మంచు లక్ష్మి ,విష్ణు ఇద్దరు కూడా చిన్నపిల్లలు కావడంతో వారికి తల్లి లేని లోటు ఉండకూడదని మోహన్ బాబుకు నచ్చచెప్పి విద్యాదేవి సోదరి అయిన నిర్మల దేవిని వివాహం చేసుకొనేలా చేశారు దాసరి నారాయణ. ఆ తర్వాతే మనోజ్ పుట్టడం జరిగింది. ఇక దీంతో ఇప్పటికీ కూడా నిర్మల దేవి అందరిని తన సొంత పిల్లలాగా చూసుకుంటూ ఉన్నది. ఇక మొదటి భార్య మరణం తర్వాత క్రమక్రమంగా మోహన్ బాబు కోపం తగ్గుతూ వస్తోందట.