ప్రస్తుతం బుల్లితెరపై తన యాంకరింగ్ తో ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది యాంకర్ అనసూయ. ఇక అంతే కాకుండా పలు సినిమాలో కూడా నటించి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ మధ్య తరచూ ఎక్కువగా ట్రోల్ కు గురవుతూ ఉంది అనసూయ. అయితే వారికి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉంటుంది . అనసూయ జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులర్ సంపాదించుకున్నా అ షో కు ఉన్నట్టుండి ఈమధ్య దూరమైంది. దీంతో ఇతర చానల్స్ వైపు మగ్గుచూపి అక్కడ బిజీగా ఉంటోంది. ఇక గత కొన్ని రోజులుగా ఎక్కువగా అనసూయను ఆంటీ అంటూ నెటిజన్లో సైతం టార్గెట్ చేస్తూ ఉన్నారు.దీంతో అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీనితో కాస్త ఈ వివాదం సద్దుమణిగిందని చెప్పవచ్చు.. అయితే అనసూయ తాజాగా తన భర్తతో కలిసి దిగిన కొన్ని సెల్ఫీలు వైరల్ గా మారుతూ ఉండడంతో మళ్ళీ ఆమె పైన ట్రోల్ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అనసూయ తాజాగా తాళిబొట్టుతో కనిపించడంతో ఎంత కాలానికి అనసూయ మెడలో తాళి ని చూశామంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు.
ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది అనసూయ కుటుంబంతో కలిసి విజయవాడకు వెళుతూ ఉండగా అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఇక ఈ ఫోటోల ద్వారా అనసూయ విజయవాడ లో దేవాలయానికి వెళుతున్నానని తెలియజేస్తోంది. అనసూయ ప్రస్తుతం అనసూయ పలు సినిమాలలో పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. అనసూయ కన్యాశుల్కం అని వెబ్ సిరీస్లో ఒక వేశ్య పాత్రలో నటించబోతోందని సమాచారం. ప్రస్తుతం అనసూయ రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కువగానే తీసుకుంటూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం అనసూయకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
https://www.instagram.com/p/CiCaWViLoxn/?utm_source=ig_web_copy_link