తెలుగు బుల్లితెరతలో ఎందరో యాంకర్లు ఉన్నారు. వారిలో తొలి తరం వారిని మాత్రం ప్రేక్షకులు ఎన్నడూ మరిచిపోలేరు. అప్పట్లో ఉదయభాను, శిల్పా చక్రవర్తిలు ఉన్నారు. వారిద్దరిలో ఉదయభాను ఇప్పటికీ కూడా కొన్ని షోల్లో కనిపిస్తూనే ఉంది. కానీ శిల్పా చక్రవర్తి మాత్రం పెళ్లి తర్వాత తన కెరీర్ కు బ్రేక్ వేసింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఈ క్రమంలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఈ తరం వాళ్లకు కూడా టచ్లో ఉంటూ వస్తోంది. శిల్పా చక్రవర్తి హైదరాబాద్ కు చెందిన మోడల్గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత బుల్లితెర యాంకర్ గా మారింది. `వావ్ ది అల్టిమేట్` గేమ్ షో ద్వారా యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత `కంటే కూతుర్నే కనాలి` అనే సీరియల్లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. తన యాంకరింగ్ తో, తన మాటలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించుకుంది.
ఎన్నో షోల ద్వారా మంచి యాంకర్ గా మారి.. పలు ఈవెంట్లు, ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అలా యాంకర్ గా కొనసాగుతున్న సమయంలో కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. కానీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో పంచుకుంటూ నే ఉంటుంది. 2019లో బిగ్ బాస్ మూడో సీజన్లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి.. రెండు వారాలు మాత్రమే కొనసాగి ఆ తర్వాతే ఎలిమినేట్ అయింది.
ఈ వయస్సులో కూడా ఆమె తన అందాలు ఆరబోస్తూ కుర్ర కారు మతిపోగోడుతూ ఫోటోలతో తెగ సందడి చేస్తూ ఉంటోంది. తాజా ఫొటోలలో ఆమె జాకెట్ లేకుండానే చీర కట్టుకుని పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శిల్పా చక్రవర్తి పెట్టిన ఫోటోలకు నెటిజన్లు కూడా ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆమె పెట్టిన ఫోటోలు జాకెట్ లేకుండా ఉండడం చూసి కుర్ర కారు రెప్ప వేయకుండా చూస్తూ అందాలను ఆస్వాదిస్తున్నారు.