ఈ వయసులో కూడా ముసలోడు లో స్పీడ్ తగ్గలేదే..? అమితాబ్ చేసిన పనికి షాక్ అవుతున్న జనాలు..!!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ గారి గురించి తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో వైవిద్యమైన పాత్రలో నటించ‌డ‌మే కాకుండా ఎన్నో షోల‌లో క‌నిపించి ప్రేక్షకులలో ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. అమితాబచ్చన్ ఇప్పటికీ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన `బ్రహ్మాస్త్ర` సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. `బ్రహ్మాస్త్రం` పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై అన్ని భాషల్లోనూ మంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఇదిలా ఉంటే మరోవైపు వికాస్ బాహ్ల్ తెర్కెక్కిస్తున్న `గుడ్ బాయ్` సినిమాలో అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారట. అయితే ఈ సినిమాలో అమితాబచ్చన్ కు కూతురిగా నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తుంది.

తాజాగా అమితాబచ్చన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారింది. అమితాబచ్చన్ ముంబైలో ఒక్క ఖరీదైన ఫ్లాట్ ని కొన్నట్లు వార్తలు జోరుగా వినిపించసాగాయి. ముంబై నగరంలోని ఫోర్ బంగ్లాస్ ప్రాంతంలోని సొసైటీలో ఈ ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.

ఇదిలా ఉంటే ఆ ఫ్లాట్ ఖరీదు ఎంత అన్న విషయం మాత్రం బయటకు రాలేదు. ఈ విషయంపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయక తప్పదు. అయితే ప్రస్తుతానికి మాత్రం అమితాబచ్చన్ ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన జుహూలో తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్న విషయం మనకి తెలిసిందే.