వివాహమైన, అవివాహమైన పురుషులు హీరోయిన్ ఊర్వశి రౌతేలా అందానికి ఫిదా అయిపోతూ ఉంటారు. అయితే తాజాగా ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నా కూడా.. ఊర్వశి అందానికి ఫిదా అయిపోయి ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశారు ఒక గాయకుడు.. అయితే ఇంతకు ఆమె అందుకు ఓకే చెప్పిందా.. తిరస్కరించిందా అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఇమే తన అందంతో అంతగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇటీవలే టాలీవుడ్ లో ఎంట్రీ గురించి వేడిగా చర్చ సాగుతోంది ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా అప్డేట్ గానే ఉంటుంది ఊర్వశి రౌతేలా . అంతేకాకుండా.. ఇమెకు ప్రముఖ ఈజిప్షియన్ గాయకుడు ఆమె అందానికి ఫిదా అయిపోయారు. అతడికి ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారు కానీ ఊర్వశి అందానికి ఫిదా అయిపోయి తనకు పెళ్లి ప్రపోజ్ చేశాడు కానీ ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నందువలన అతని ప్రతిపాదన ఈ ముద్దుగుమ్మ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా నేను విచ్చన్నమైన కుటుంబాన్ని ఇష్టపడను నా కుటుంబంలో ఎవరు ఇంకా విడాకులు తీసుకోలేదని కూడా ఊర్వశి వాక్యానించింది.ఇక తాజాగా ప్రముఖ హిందీ మీడియాతో మాట్లాడిన ఊర్వసి రౌతేలా తన వ్యక్తిగత విషయం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది తన జీవితంలో రిషబ్ పంత్ గురించి కూడా తెలియజేసింది. అలాగే ఈజిప్షియన్ గాయకుడు నుండి ఆమెకు అందుకున్న ప్రతిపాదన పైన కూడా మాట్లాడడం జరిగింది.ఈజిప్షియన్ గాయకుడితో పెళ్లి ప్రపోజల్ పై స్పందిస్తూ భారతీయ సంస్కృతికి ఈజిప్షియన్ సంస్కృతికి చాలా తేడా ఉందని ఆ వ్యక్తికి అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.. ఇక అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే భారతీయ అమ్మాయిగా మేము కూడా మొదట కుటుంబానికి గౌరవం ఇస్తామని తెలిపింది. నిజానికి తనకి విడాకులు అంటే ఏమిటో తెలియదట ముంబైకి వచ్చినప్పుడు అక్కడ విడాకులు చాలా సాధారణంగా గ్రహించాలని తెలియజేస్తుంది. ఇక ఈమె ఉత్తరకాండ కు చెందిన యువతి.