రూ.50 కోట్లు ఇవ్వాల్సిందే అంటూ నరేష్ ను ఇరుకునపెట్టిన పవిత్ర లోకేష్..!!

పవిత్ర లోకేష్ – వీ.కే. నరేష్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు విడివిడిగా వీరికి మంచి గుర్తింపు ఉండేది. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసిన తర్వాత ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు. నిజానికి పవిత్ర లోకేష్ సుచేంద్ర ప్రసాద్ ను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. నరేష్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీలో వైరల్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా అటు పవిత్ర లోకేష్ , ఇటు నరేష్ ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారని వార్తలు వైరల్ అవ్వడమే కాకుండా అందుకు తగ్గట్టుగా వీరిద్దరు చట్టాపట్టాలేసుకొని ఎక్కడికి వెళ్లినా సరే కలిసి వెళ్తూ ఉండడంతో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.All about Naresh and Pavithra Lokesh Issue

గత రెండు నెలల కిందట ఎక్కడ చూసినా వీరి ప్రేమ వ్యవహారమే పెద్ద ఎత్తున వైరల్ అవడం గమనార్హం. నరేష్ పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారని , అందుకు కృష్ణ సపోర్టు కూడా ఉందని ఎలాగైనా సరే తమ బంధానికి సపోర్ట్ చేయండి అని పవిత్ర లోకేష్ మీడియా ముందు వేడుకున్న విషయం తెలిసిందే. కానీ ఉన్నట్టుండి రంగంలోకి దిగిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండానే ఆ అమ్మాయిని ఎలా వివాహం చేసుకుంటాడు అంటూ కన్నడ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేసింది. అంతే కాదు కన్నడలో వీరిద్దరూ ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్లగా.. అక్కడ ఒకే హోటల్ గదిలో నుంచి బయటకు రావడంతో విషయం తెలుసుకున్న రమ్య రఘుపతి మీడియాతో సహా అక్కడ వీరిని పట్టుకుంది. అంతే కాదు పవిత్ర లోకేష్ ను కూడా చెప్పు తో కొట్టబోయింది.Then Anasuya .. now Holy Lokesh .. cheating by believing them! » Jsnewstimesఇకపోతే ఈ సమస్యలన్నీ సద్దు మనిగేలోపే మళ్ళీ మరొక వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరిదీ ప్రేమ బంధం కాదు అని సహజీవనం చేయాలి అంటే ఒప్పందం తప్పనిసరి అంటూ వార్తలు రావడం జరిగింది.ఇక పవిత్ర లోకేష్ కు ఒప్పందం ప్రకారం నరేష్ ప్రతినెల 25 లక్షల రూపాయలను ఇవ్వాలట. ఒకవేళ నరేష్ పవిత్ర లోకేష్ ను వదిలిపెట్టినా లేదా ఇంకొక అమ్మాయితో తిరిగినా సరే పవిత్ర లోకేష్ కు భరణం కింద 50 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆ ఒప్పందంలో ఉన్నట్లు సమాచారం . దీన్ని బట్టి చూస్తే వీరిది ప్రేమ బంధం కాదు .. ఒప్పంద బంధం అని 50 కోట్ల రూపాయల పేరిట నరేష్ ను ఇరుకును పెట్టింది పవిత్ర లోకేషన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.