సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి కచ్చితంగా సమయాన్ని కేటాయిస్తాడు అని చెప్పడంలో సందేహం లేదు. అందుకే సమయం దొరికిందంటే చాలు తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోని ఆయనకు 47 సంవత్సరాల వయసులో కూడా ట్రెండీ లుక్ తో మరింత హ్యాండ్సమ్ గా యువతను ఆకట్టుకుంటున్న కలల రాకుమారుడిగా మహేష్ బాబు నెట్టింట మరింత క్రేజ్ ను సంపాదించుకోవడం గమనార్హం.
ఇకపోతే పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరొక సినిమా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ విషయం ప్రకటించినప్పటి నుండి ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు కళ నెరవేరబోతోంది అని చెప్పాలి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వారి ఎదురు చూపులకు ఇప్పుడు బ్రేక్ పడిందని చెప్పాలి.. ఇకపోతే ఈ సినిమా షూటింగు త్వరలోనే రెగ్యులర్ గా మొదలు కాబోతున్నట్లు సమాచారం.ఇక మహేష్ బాబు కొత్త లుక్ లోకి మారడానికి కారణం త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా అని తెలుస్తోంది. మహేష్ బాబు ఇలా కొత్త లుక్ లోకి మారడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈ లుక్కే ఇప్పుడు ట్రెండ్ గా మారిపోతుంది. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు తన కూతురు సితారతో కలిసి దిగిన ఒక ఫోటో బయటకు రావడంతో అది మరింత వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి త్వరలోనే ఒక ప్రముఖ ఛానల్లో డాన్స్ షో కి పాల్గొనబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. మహేష్ బాబు తన కూతురు సితార చేయి పట్టుకొని నడుస్తున్న ఒక బ్యూటిఫుల్ ఫోటో చూసి అందరూ స్వీట్ మెమోరీస్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.