తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సినిమాలలో నటించిన హీరోయిన్లలో అమలాపాల్ కూడా ఒకరిని చెప్పవచ్చు.. ఇక ఈమె నటించింది కొన్ని సినిమాలే అయినా తన నటనతో ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే తెలుగులో అంతగా పేరు రాకపోయినా తమిళంలో మాత్రం మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఇక తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించింది. ఇక అవకాశాలు బాగా వస్తున్న సమయంలోనే b తమిళ డైరెక్టర్ అయిన A.L.విజయ్ ను వివాహం చేసుకుంది. కానీ కొన్ని కారణాల చేత విడాకులు ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఆమె కెరియర్ కాస్త ఒడిదుడుకులకు ఎదురైందని చెప్పవచ్చు.తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడే హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలో పెళ్లి వల్ల ఆమె సినీ కేర్ ఒక్కసారిగా తారుమారు అయ్యిందని చెప్పవచ్చు. అయితే తెలుగులో నటించకపోయినప్పటికీ ఇతర భాషలలో మాత్రం బాగా సినిమాలలో నటిస్తూ.. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఉన్నది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు పైనే కావస్తోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కొన్ని విషయాలను తెలియజేసింది.అమలాపాల్ మాట్లాడుతూ.. కెరియర్లో తను ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేస్తూ తన సినిమా అవకాశాల కోసం తన తానే స్వయంగా వెతుక్కున్నట్టుగా తెలియజేసింది. అంతేకాకుండా తన కుటుంబానికి తను దూరంగా ఉన్నట్టుగా అనిపించింది అని తెలిపింది. అప్పుడు తనలో తాను చాలా బాధపడి పోయానని తెలిపింది అమలాపాల్. ఇక అవన్నీ గుర్తు చేసుకొని ఆ సమయంలో ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానని చాలా బాధపడిందట. ఇక ఆ క్షణమే తన సినిమాలను వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదామా అనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని తెలియజేసింది అమలాపాల్. ఇక ఆ సమయంలోనే తన తండ్రి మరణించారని తెలిపింది. అప్పుడు తనని కొన్ని భయాలు కూడా వెంటపడ్డాయని ఆ సమయంలో నాకు నేను చాలా స్ట్రాంగ్ గా మారిపోయి తనకు ఎదురైన సమస్యలను ఇబ్బందులనుం.. అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్లానని నిర్ణయించుకున్నానని అమలాపాల్ తెలిపింది. ప్రస్తుతం తన జీవితం చాలా సంతోషంగా ఉంది అని ఇప్పుడు తన పైన తనకి పూర్తి విశ్వాసం వచ్చిందని తెలిపింది.