టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత నాగచైతన్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీరిద్దరూ ప్రేమించుకుని ఇంట్లో గొడవపడి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. అలా నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్న ఈ జంట కొన్ని కారణాలవల్ల విడిపోవడం జరిగింది ఇకపోతే వీరి వీడాకుల విషయం జరిగి సుమారుగా 9 నెలలకు పైగా అవుతున్నా.. ఇప్పటికీ వీరి విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గానే మారుతూ ఉండడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఇండస్ట్రీలో ఈ కపుల్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇకపోతే విడాకుల తర్వాత ఎవరి పనిలో వాళ్ళు.. ఎవరి సినిమాలలో వారు బిజీగా మారిపోయారు. కానీ సమంత మాత్రం అమ్మ చెప్పింది అని ట్యాగ్ లైన్ తో ఇంస్టాగ్రామ్ ద్వారా తన మనసులో మాటను బయట పెడుతూ రకరకాల కామెంట్లు , పోస్ట్ చేస్తూ వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి సమస్య సద్దుమణిగింది అనుకునే లోపే బాలీవుడ్లో తన పాగా వేసుకోవడానికి సిద్ధమైన సమంత అక్కడ కాఫీ విత్ కరణ్ షో కి హాజరై నాగచైతన్య పై తనకు కోపం ఉంది అనే విషయాన్ని తన మాటల ద్వారా తెలియజేసింది. ఇక నాగచైతన్యను మాజీ భర్త అని సంబోధించడమే కాకుండా ఒకే గదిలో ఉంచితే పదునైన కత్తులు , కటార్లు లేకుండా చేసుకోవాలని ఇక తన మామ నాగర్జునను కూడా టార్గెట్ చేస్తూ రకరకాల వ్యాఖ్యలు చేసింది.
ఇక ఈ షో చూసిన నాగచైతన్య , సమంత పై కోపంతో రగిలిపోవడమే కాకుండా సమంతకి, తనకు సంబంధించిన కొన్ని సినిమాల అగ్రిమెంట్లను కూడా చించేసాడు అని , పెళ్లి ఫోటోలను కూడా కాల్చేశాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సమంతను టార్గెట్ చేస్తూ నాగచైతన్య కూడా త్వరలో కాఫీ విత్ కరణ్ షో లో హాజరవబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూకి హాజరైన నాగచైతన్యకు కాఫీ విత్ కరణ్ షో కి హాజరవుతారా అని అడగగా కరణ్ చాలా మంచి వ్యక్తి ..అతను చేసే పనులు ప్రతి ఒక్కటి కూడా నాకు నచ్చుతాయి. ఇక అంత గొప్ప వ్యక్తి రమ్మని పిలిస్తే ఎవరు మాత్రం కాదంటారు.. ఖచ్చితంగా పిలిస్తే హాజరవుతాను అంటూ చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే నాగచైతన్య సమంతను టార్గెట్ చేస్తూ ఆమెను ఇరకాటంలో పెట్టడానికి సిద్ధమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి.