డైరెక్టర్ త్రివిక్రమ్ డిమాండ్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ త్రివిక్రమ్. ఇక అల్లు అర్జున్ తో కలిసి అలా వైకుంఠపురం సినిమా తెరకెక్కించి ఇప్పటికి రెండు సంవత్సరాలు పైనే కావోస్తోంది. అయితే త్రివిక్రమ్ తర్వాత సినిమా మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు ఆగస్టు నుంచి మహేష్ తో సినిమా మొదలవుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి కానీ సినిమా షూటింగ్ బందు కారణం వల్ల ఈ సినిమా ఇప్పుడే మొదలవుతుందో లేదో తెలియాల్సి ఉంది. ఇక దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ సంబంధించి ఒక యాడ్ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది వాటి గురించి ఇప్పుడు చూద్దాం.Allu Arjun Shows Off His Style in Floral Shirt With a Hat As He Preps Up  for a Shoot With Trivikram Srinivas (View Pics) | 🎥 LatestLY

ఇక ఈ యాడ్ కోసం త్రివిక్రమ్ ఏకంగా రూ.45 లక్షల రూపాయలు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా ప్రముఖ కంపెనీ యాడ్ లో నటించడం ద్వారా అల్లు అర్జున్ క్రేజ్ కూడా బాగా పెరిగిపోతుంది. ఇక అందుచేతనే పలు యాడ్ లో నటించడానికి అల్లు అర్జున్ కూడా చాలా ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా షూటింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు దాదాపుగా రూ.30 కోట రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారు.

అందువల్లనే డైరెక్టర్ త్రివిక్రమ్ కు కేవలం ఒక్క పూట యాడ్ కోసం రూ.45 లక్షల రూపాయలు అద్దుకోవడంలో ఆశ్చర్యం లేదని అభిమానుల సైతం కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇక మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమా 2023 సమ్మర్లో విడుదల అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇది మూడవ సినిమా. మరి ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే నటిస్తున్నది. అయితే రెండవ హీరోయిన్ కోసం వెతుకులాట చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పుతుందేమో చూడాలి.