ఈ మధ్యకాలంలో హీరోలు ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకొని .. ఆ తర్వాత గొడవలు పడి విడిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తూ.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన సందర్భాలు ప్రస్తుతం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇక అలాంటి వారిలో అలనాటి అందాల తార రాశి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె వరస చిత్రాలలో నటించి ఎన్నో సూపర్ హిట్ విజయాలను సొంతం చేసుకుంది. ఇక సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటిస్తోంది.
ముఖ్యంగా వెండితెరపై, బుల్లితెరపై ఎన్నో పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె తెరవెనుక జీవితం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈమె అసలు పేరు విజయలక్ష్మి కాగా ఇండస్ట్రీలోకి బాలనటిగానే అడుగు పెట్టింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత పెళ్లి పందిరి సినిమాతో హీరోయిన్గా దర్శనమిచ్చింది . ఆ సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత ఎక్కడా వెను తిరిగి చూడలేదని చెప్పవచ్చు. ఇక స్టార్ హీరోలతో సైతం నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే పెద్దల అంగీకారంతో డైరెక్టర్ శ్రీనివాస్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.
ఇకపోతే శ్రీనివాస్ ను వివాహం చేసుకోకముందే ఈమెకు రెండు పెళ్లిళ్లు జరిగాయని చాలామందికి తెలియదనే చెప్పాలి. తనకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తమిళ్ ఇండస్ట్రీ డైరెక్టర్ అశోక్ సామ్రాట్ ను ప్రేమించింది. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకుంది . అయితే కొంత కాలానికి అశోక్ సామ్రాట్ తన మొదటి భార్య దగ్గరకు వెళ్లిపోవడంతో రాశి అతని నుంచి దూరమైంది. ఇక ఆ తర్వాత మనసిచ్చి చూడు సినిమా దర్శకుడు సురేష్ వర్మను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతడి నుంచి కూడా దూరమైన ఈమె ప్రస్తుతం డైరెక్టర్ శ్రీనివాస్ ని వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.