తన జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది.. రజినీకాంత్.. కారణం..?

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బస్ కండక్టర్ స్థాయి నుంచి కోలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలే స్థాయికి సూపర్ స్టార్ ఎదిగాడు అంటే తన జీవితంలో ఎంత కష్టపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తన జీవితంలో 10% సంతోషం మాత్రం కూడా మిగల్లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా చెన్నైలో హ్యాపీ సక్సెస్ ఫుల్ లైఫ్ త్రూ క్రియా యోగ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు..

ఇక రజనీకాంత్ మాట్లాడుతూ.. నేను గొప్ప నటుడు అని అందరూ అనుకుంటారు. ఇక అది విమర్షో.. ప్రశంసో నాకు అర్థం కావడం లేదు.. రాఘవేంద్ర , బాబా ఈ రెండు సినిమాలు మాత్రమే నాకు ఆత్మసంతృప్తినిచ్చాయి. బాబా సినిమా చూశాక చాలామంది హిమాలయాలు వెళ్ళామని చెప్పారు. ఇక నా అభిమానులు కొందరైతే సన్యాసులుగా మారిపోయారు. కానీ నేను మాత్రం నటుడిగా ఇక్కడే కొనసాగుతున్నాను. ఇక హిమాలయాల్లో కొన్ని అపూర్వమైన మౌలికలు కూడా దొరుకుతాయి అవి తింటే వారానికి సరిపడా శక్తి కూడా లభిస్తుంది. ఇక ఆరోగ్యం అనేది మనిషికి చాలా ముఖ్యమైనది..

మనం అనారోగ్యానికి గురైతే మనకు కావలసిన వాళ్లు కూడా తట్టుకోలేరు. నా జీవితంలో డబ్బు, హోదా, పేరు ప్రఖ్యాతలు అన్నీ చూసాను. కానీ సంతోషం, ప్రశాంతత మాత్రం లేదు ఎందుకంటే అవి శాశ్వతంగా ఉండేవి కాదు కదా అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇక రజనీకాంత్ సినిమా విషయాలకు వస్తే ప్రస్తుతం జైలర్ సినిమా చేస్తున్నాడు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా వహిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఏది ఏమైనా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇలా జీవితంలో సంతోషం లేదు అని చెప్పడంతో ఆయన అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.