టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ కంటే ముందే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని ఆ తర్వాత తన నటనతో.. చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మరెన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. జానపద , పౌరాణిక , సాంఘిక వంటి చిత్రాలలో కూడా నటించిన అక్కినేని నటనకు చాలామంది అభిమానులు ఫిదా అయ్యేవారు. ఇక ఈయన సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు థియేటర్ లలో చాలామంది అభిమానులు గోల చేసేవారు. ఇకపోతే ఎన్టీఆర్ తో ఈయన కాంబినేషన్ చాలా బాగా కుదిరింది.
ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ కలిసి నటించిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇవ్వడమే కాకుండా మంచి సోషియో ఫాంటసీ నేపథ్యంలో కూడా తెరకేక్కాయి. ఇక ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఈ తరం యువతను కూడా ఆకట్టుకుంటుంది అంటే ఇక వీరి నటన ఎంత బాగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు పెట్టుబడులు పెడుతూ కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టి..తన వారసులను ఇండస్ట్రీలోకి ప్రవేశింప చేశాడు అక్కినేని.
ఎంతో ఉన్నతంగా బ్రతికిన ఏఎన్ఆర్ చివరి దశలో క్యాన్సర్ బారిన పడి మరణించిన విషయం తెలిసిందే. కానీ ఆయన చనిపోయే ముందు కొద్ది రోజుల వరకు ఎవరిని కూడా తన దగ్గరకు రాణించేవారు కాదట. అంతేకాదు ఆయన చర్మం ముట్టుకుంటే ఊడిపోయేది అని ఇటీవల ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక ఎంతో బాగా బ్రతికిన అక్కినేని ఇలా చివరికి క్యాన్సర్ వ్యాధితో పోరాడి మరీ మరణించడం చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి . ఇది ఇటీవల తెలుసుకున్న ఆయన అభిమానులు సైతం కన్నీటి పర్యంతం అవుతున్నారు.