టాలీవుడ్లో దర్శకుడిగా నిలదొక్కుకోవాలంటే తను చేసే ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావాల్సిందే. అయితే ఈ క్రమంలోనే కొందరు మాత్రం సక్సెస్ఫుల్ చిత్రాలతోనే తమ కెరీర్ను సాగిస్తుంటారు. అలాంటివారిలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఒకరు. ఆయన ‘మిర్చి’ సినిమా నుండి దర్శకుడిగా మారి వరుసగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కిస్తూ వచ్చారు.
ఇలాంటి స్టార్ డైరెక్టర్ కేవలం ఒక్కటంటే ఒక్క సినిమా ఫెయిల్యూర్తో ఇంతకాలం సంపాదించుకున్న పేరు మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ భారీ అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అదిరిపోయే బ్లాక్బస్టర్ హిట్ అందుకుందామని చూసిన కొరటాల ఆశలపై ప్రేక్షకులు నీళ్లు జల్లారు. ఒక ఔట్డేటెడ్ కథను ఇద్దరు స్టార్ హీరోల చరిష్మాతో నెట్టుకురావచ్చని చూసిన కొరటాలకు ఘోరమైన పరాజయం ఎదురైంది.
వరుస సక్సెస్ఫుల్ చిత్రాలతో కొండపై కూర్చున్న కొరటాల ఆచార్య అనే ఒక్క సినిమాతో పాతాళంలోకి పడిపోయినట్లు అయ్యింది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. అయినా ఆచార్య సినిమా ఫ్లాప్ను ఎవరూ ఆపలేకపోయారు. మరి కొరటాల తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి చేయబోతుండటంతో, ఇప్పుడు అందరి చూపులు ఈ సినిమాపైనే పడ్డాయి.