జనగణమన లో క్రేజీ హీరోయిన్..పూరీ టైమింగ్ అదుర్స్..?

టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాధ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు సినిమా అనౌన్స్ చేసి…రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ ని తెరకెక్కించి..ఇంకేదో కారణాలతో సినిమా ని వాయిదా వేస్తూ.. కాలం సాగదీస్తూ టైం వేస్ట్ చేయడం పూరీ కి రాదు. పూరీ మాట అంటే మాటే..ప్రతిది పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటాడు..కధ రాయడానికి టైం తీసుకుంటాడు ఏమో కానీ..ఆ కధను తెరకెక్కించడంలో..రిలీజ్ చేయడంలో పూరీ లాంటి డైరెక్టర్ మరోకడు లేడు..రాడు ..రాబోడు.

ఒకానోక సంధర్భంలో దర్శకధీరుడు జక్కన్న కూడా ఇదే చెప్పుతూ పూరీ లా ఫాస్ట్ గా సినిమాలు నేను తెరకెక్కించలేను అంటూ కామెంట్స్ చేశారు. ప్రజెంట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో “లైగర్” సినిమా ను చేస్తున్న పూరీ..ఆ సినిమాతో పోయిన తన ఫాం ని మళ్లీ తిరిగి తెచ్చుకోవాలని తెగ ట్రై చేస్తున్నాడు అందుకే కాబోలు సినిమాకోసం బాగా శ్రమిస్తున్నారు. కాగా , రీసెంట్ గానే..విజయ్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు .

నిజానికి ఈ సినిమా మహేష్ బాబుతో చేయాలని డిసైడ్ అయ్యాడు కానీ..మహేష్ కి ఈ స్టోరీ పెద్దగా నచ్చకపోవడంతో..యూటర్న్ తీసుకుని విజయ్ తో తెరకెక్కిస్తున్నడు. ఇప్పటికే రిలీజైన సినిమా కి సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..శ్రీదేవి డాటర్ జాన్వీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటి నుండో టాలీవుడ్ ఎంట్రీ పై కనేస్తున్న జాన్వీ.. ఈ సినిమా తో ఎంట్రీ ఇస్తే మంచి విజయం అందుకుంటుందని పూరీ అభిప్రాయం..ప్రస్తుతం బోనీ కపూర్ తో చర్చల్లో ఉన్నాడట. పాన్ ఇండియా లెవల్ లో దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతగా వ్య్వహరిస్తున్నాడు. మరి చూడాలి..ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో..?