‘సలార్‌’ ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ అన్ని కోట్లా .. బాహుబలికి అమ్మ మొగిడిలా ఉండబోతోందట..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని..చేస్తున్న మూవీ “సలార్”. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అవుతుంది. షూటింగ్ స్టార్ట్ చేయడమే ఆలస్యంగా మొదలు పెడితే.. ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని సార్లు.. కరోనా కారణంగా మరి కొన్ని సార్లు..రాధే శ్యామ్ ప్రమోషన్స్ కోసం మరి కొన్ని సార్లు..ఇలా ఆగి ఆగి బ్రేక్ పడుతూ.. ఫైనల్ గా 70 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాళ్ల గాయం కారణంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ప్రభాస్..తిరిగి మళ్లీ షూట్ లో జాయిన్ అయ్యిన్నట్లు తెలుస్తుంది.

KGF 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకుని ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్.. అప్పుడెప్పుడో బాహుబలి తో అందుకున్న హిట్ తప్పిస్తే..ఇప్పటి వరకు మరో హిట్ పడలేదు. సాహో, రాధే శ్యామ్ అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో ప్రభాస్ ఆశలన్ని కూడా ఈ సినిమా పైనే పెట్టుకుని ఉన్నారు. ప్రశాంత్ కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు. ఎలాగైనా చరిత్రలో నిలిచిపోయే యాక్షన్ సినిమా గా ఉండాలని డబ్బు కోసం వెనకడుగు వేయకుండా కోట్లకు కోట్లు.. ఈ సినిమా కోసం కుమ్మరిస్తున్నారట.

ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ సలార్ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం..భారీ ప్లాన్ చేసిన్నట్లు తెలుస్తుంది. దీని కోసం సపరెటు గా 5 కోట్ల రూపాయలతో సెట్ వేయించి.. అందులో యాక్షన్ సీన్ కోసం కావాల్సి ఎక్విప్ మెంట్ అంతా సిద్ధం చేసుకుంటున్నారట. ఈ భారీ యాక్షన్ సీన్ కోసం ప్రశాంత్ ఏకంగా 20 కోట్లు ఖర్చు చేస్తున్నారట. అయితే, పట్టుమని పది నిమిషాలు కూడా లేని ఈ సీన్ కోసం 20 కోట్లు అవసరమా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ, ప్రశాంత్ నీల్ ఈ సీన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదట. అంతేకాదు.. ఈ సీన్స్ లోనే ప్రభాస్ కు హీరోయిన్ శృతి హాసన్ రియల్ క్యారెక్టర్ తెలుస్తుందని.. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో తండ్రీ ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుందని అంటున్నారు. పై గా ఈ సినిమాలో ప్రభాస్ ని మనం సరికొత్త లుక్ లో చూస్తామట. ఇప్పటి వరకు బాహుబలి సినిమా నే టాప్ అనుకుంటున్న ప్రభాస్ కెరీర్ లో సలార్ సినిమా దానికి అమ్మ మొగిడిలా ఉండబోతుంది అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో..?