ఆచార్య ఈవెంట్ కి ఊహించని గెస్ట్.. ట్వీస్ట్ అద్దిరిపోలా..?

సినిమా ఈవెంట్ ఏమో కానీ.. ఆ కార్యక్రమం పూర్తి అయ్యే సరికి రోజుకో వార్త నెట్టింట షికారు చేస్తుంది. మనకు తెలిసిందే..కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని..దాదాపు మూడేళ్లు కష్టపడి..తెరకెక్కించిన సినిమా “ఆచార్య”. నిజానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. కరోనా కారణంగా కొన్ని సార్లు.. సినిమా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా మరికొన్ని సార్లు వాయిదా పడుతూ వచ్చింది.

ఇక ఫైనల్ గా ఎట్టకేలకు సినిమా ను అయితే రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైపోయారు. ఏప్రిల్ 29న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అవ్వడనికి ప్లాన్ చేసారు ఆచార్య టీం. ఈ క్రమంలో నే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ. ముందు ఈ ఫంక్షన్ ని ఏపీలోని విజయవాడలో జరుపుద్దాం అనుకున్నారట. ఎలాగో ఏపీ నే కాబట్టి సీ ఎం ని గెస్ట్ గా పిలుద్దాం అని ప్లాన్ చెశారు. కానీ, అది ఎందుకో వర్క్ అవుట్ కాలేదు.

ఇక ఫైనల్లీ ఫంక్షన్ ను హైదరబాద్ లోనే పెట్టుకోవడానికి ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు గెస్ట్లు గా రాజమౌళి, పవన్ కల్యాణ్ ని పిలవాలని అనుకున్నారట. కానీ, అది జరిగే పని కాదు అని సినీ విశ్లేషకులు ముందే తేల్చేశారు . ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు గా రాజమౌళికి-పవన్ కి ఇన్నర్ ఈగో వార్ జరుగుతుందన్న టాక్ వినిపిస్తూనే ఉంది. చాలా సార్లు ప్రూవ్ అయ్యింది కూడా. దీంతో ఇప్పుడు గెస్ట్ గా సూపర్ హ్యాండ్ సం హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుని..ఫిక్స్ చేశారట కొరటాలు. నిజానికి కొరటాల మహేష్ మంచి ఫ్రెండ్స్..ఈ చనువుతోనే ఆచార్యకి మహేష్ ని గెస్ట్ గా పిలిపించబోతున్నారట కొరటాలు. మరి చూడాలి.. మహేష్ రాక..ఆచార్యకి ఎంత కలిసివస్తుందో..?