ఆ విషయంలో కొరటాల కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?

కొరటాల శివ.. పేరు కి పరిచయం అవసరం లేదు. మనిషి సైలెంట్..సినిమాలో వైలెన్స్. తీసే ప్రతి సినిమాలో తన మార్క్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. ప్రభాస్ హీరో గా నటించిన మిర్చి సినిమాలో ఆ విషయం మన బాగా గమనించవచ్చు. కొరటాల డైరెక్షన్ లో చేయాలాని ప్రతి హీరో ఆశపడుతుంటాడు. సినిమా హిట్ ఫట్టా అనే సంగతి పక్కన పెడితే ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుంది.. మరో కొత్త ఎలిమెంట్స్ చూయిస్తారు ఆ హీరో నుండీ .. అందుకే కాబోలు ఆయన తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తారు అందరు.

ప్రజెంట్ కొరటాల శివ..మెగాస్టార్ చిరంజీవి-చరణ్ లతో కలిసి..ఆచార్య అనే సినిమాను తెరకెక్కించాడు. అసలు అన్ని బాగుంటే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, అలా యూటర్న్ తీసుకుని.. హైవే ఎక్కి..ఇప్పుడు డెస్టినీకి రీచ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 29 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు ఆచార సినిమాని మేకర్స్. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత వెంటనే తారక్ తో ఓ సినిమా ని తెరకెక్కించబోతున్నాడు కొరటాల.

ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్స్ పనులను కంప్లీట్ చేసిన కొరటాల..తారక్ కోసం సుమారు 4 కోట్లు ఖర్చు చేసి అద్దిరిపోయే సెట్ కూడా రెడీ చేశారట. జూన్ రెండో వారంలో సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై కొరటాల బాగా కన్ఫ్యూజ్ అవుతున్నట్లు తెలుస్తుంది. మొదట అలియా భట్ అనుకున్న అందరు..ఇప్పుడు పెళ్లి కావడం తో సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ ప్లేస్ లోకి రష్మిక వచ్చిందనుకున్నారు అంతా..కానీ తారక్ ఫ్యాన్స్ ఆమెని యాక్సెప్ట్ చేయకపోవడంతో ..తన లక్కి హీరోయిన్ నే మళ్లీ నమ్ముకున్నట్లు తెలుస్తుంది. కొరటాల. తార కు జోడీగా కియార అద్వాని నీ ఫిక్స్ చేసిన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇది వరకే భరత్ అనే నేను సినిమాలో మెప్పించిన ఈ బ్యూటీ తారక్ కు పర్ ఫెక్ట్ జోడీ అంటున్నారు అభిమానులు కూడా మరి చూడాలి..కొరటాల ఏం చేస్తారో..?